Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఫ్లాన్ ను అమలు చేసిన బెంగళూరు

తెలంగాణలో మాదిరి కాకుండా.. మొత్తం చలానాలో 50 శాతం రాయితీ ఇవ్వటం ద్వారా.. పెండింగ్ చలానాల్ని క్లియర్ చేసుకునే అవకాశాన్ని వాహనదారులకు కల్పించారు.

By:  Garuda Media   |   29 Aug 2025 2:00 PM IST
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఫ్లాన్ ను అమలు చేసిన బెంగళూరు
X

కొన్నేళ్ల క్రితం తెలంగాణ పోలీసులు చేపట్టిన ట్రాఫిక్ చలానాల డ్రైవ్ ఎంతలా సక్సెస్ అయ్యిందో తెలిసిందే. 50 శాతం.. అంతకంటే ఎక్కువ మొత్తంలో ఫైన్ల మీద రాయితీ ఇవ్వటం ద్వారా వాహనదారులు పెద్ద ఎత్తున పెండింగ్ చలానాల్ని కట్టేయటం తెలిసిందే. ఈ మోడల్ తెలంగాణలో సక్సెస్ కావటమే కాదు.. ఇప్పటికే రెండుసార్లు ఈ డ్రైవ్ నిర్వహించటం ద్వారా భారీ ఎత్తున ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరింది. తెలంగాణ పోలీసులు చేపట్టిన ఈ ట్రాఫిక్ చలానా డ్రైవ్ ను.. కొన్ని మార్పులు చేసిన బెంగళూరులోనూ అమలు చేస్తున్నారు.

తెలంగాణలో మాదిరి కాకుండా.. మొత్తం చలానాలో 50 శాతం రాయితీ ఇవ్వటం ద్వారా.. పెండింగ్ చలానాల్ని క్లియర్ చేసుకునే అవకాశాన్ని వాహనదారులకు కల్పించారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 19 వరకు ఈ ఆఫర్ ను అమలు చేస్తున్నారు. దీంతో..పెద్ద ఎత్తున వాహనదారులు తమ పెండింగ్ చలానాల్ని క్లియర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక ద్విచక్ర వాహనదారుడు తనకు పడిన ఫైన్లు చెల్లించాడు.

ఇతగాడి బైక్ కు ఏకంగా 100 చలానాలు పడ్డాయి. మొత్తం ఫైన్ రూ.46,500. ఇందులో 50 శాతాన్ని కట్టేసిన ఇతను.. తన చలానాల భారాన్ని సగానికి తగ్గించుకున్నాడు. ఈ రాయితీ సౌకర్యం కర్ణాటక రాష్ట్ర ఖజానకు ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. ఇప్పటివరకు దాదాపు రూ.19 కోట్ల మేర నిధులు ట్రాఫిక్ విభాగానికి చేరినట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. తెలంగాణలో షురూ చేసిన ఈ ఆఫర్ చలానాలు ఉన్న వాహనదారులకు పెద్ద ఎత్తున రిలీఫ్ ను ఇస్తుందని చెప్పక తప్పదు.