Begin typing your search above and press return to search.

మోడీ మాస్క్‌తో మొబైల్ షాపుల్లో దొంగతనం.. సినిమాను తలపించేలా!

సినిమాల్లో దొంగలు రకరకాల మాస్కులు వేసుకుని బ్యాంకులు, షాపులు దోచేయడం మనం చూసే ఉంటాం.

By:  Madhu Reddy   |   1 July 2026 12:01 AM IST
మోడీ మాస్క్‌తో మొబైల్ షాపుల్లో దొంగతనం.. సినిమాను తలపించేలా!
X

సినిమాల్లో దొంగలు రకరకాల మాస్కులు వేసుకుని బ్యాంకులు, షాపులు దోచేయడం మనం చూసే ఉంటాం. సరిగ్గా అలాంటి సీనే రియల్ లైఫ్‌లో రిపీట్ అయింది. రాజస్థాన్‌లోని బిల్వారా పట్టణంలో ఒక దొంగ ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాస్క్ ధరించి మొబైల్ షాపులో చోరీకి పాల్పడ్డాడు. అర్థరాత్రి వేళ జరిగిన ఈ వింత దొంగతనం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అర్ధరాత్రి వేళ మాస్క్‌తో ఎంట్రీ:

రాజస్థాన్‌లోని బిల్వారా పట్టణంలో ఉన్న ఒక మొబైల్ షాపులోకి ఈ విచిత్ర దొంగ చొరబడ్డాడు. తన ముఖం ఎవరికీ గుర్తుపట్టకుండా ఉండడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ మాస్క్‌ను ముఖానికి తగిలించుకున్నాడు. ఇక ఆ మాస్క్‌తోనే షాపు తాళాలు పగలగొట్టి లోపలికి దూరాడు. లోపల ఉన్న గ్లాస్ కేసులు, లాకర్లను చాలా ఈజీగా పగలగొట్టి తన పని కానిచ్చేశాడు.

రూ. 5 లక్షల విలువైన ఫోన్లు మాయం:

షాపులోకి దూరిన ఆ దొంగ, అక్కడ డిస్‌ప్లేలో ఉన్న సుమారు 35 నుండి 40 ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను చకచకా మూటగట్టేసుకున్నాడు. షాపు ఓనర్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. దొంగతనం జరిగిన మొబైల్ ఫోన్ల మొత్తం విలువ సుమారు రూ. 4 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక దొంగ లూటీ చేసిన తర్వాత ఎంచక్కా అక్కడి నుండి పరారయ్యాడు.

సీసీటీవీ విజువల్స్ చూసి పోలీసుల మైండ్ బ్లాక్:

మరుసటి రోజు ఉదయం షాపు యజమాని దొంగతనాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని దుకాణంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా వాళ్ల మైండ్ బ్లాక్ అయింది. ఇక అందులో దొంగ మోదీ మాస్క్‌తో స్పష్టంగా కనిపించాడు. ముఖం కనపడకుండా ప్లాన్ చేసినా, అతని నడక మరియు శరీర ఆకృతి ఆధారంగా పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు.

అదే రాత్రి మరో షాపులోనూ ట్రై చేశాడు:

పోలీసుల దర్యాప్తులో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే దొంగ అదే రాత్రి అదే మాస్క్‌తో పట్టణంలోని మరో దుకాణంలో కూడా దొంగతనం చేయడానికి ప్రయత్నించాడట. అయితే అక్కడ కుదరకపోవడంతో ఈ మొబైల్ షాపును టార్గెట్ చేసినట్లు సమాచారం. ఇక ఈ వినూత్న దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేసి, దొంగను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

టెక్నాలజీ పెరిగిపోతుండడంతో దొంగలు కూడా ఇలా రూట్ మార్చి వింత వింత ఐడియాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇక ప్రధాని మోదీ మాస్క్‌తో దొంగతనం చేయడం స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా తెగ నవ్వులు పూయిస్తోంది. మరి ఈ 'సినిమా' తరహా దొంగను మన పోలీసులు ఎంత త్వరగా పట్టుకుంటారో చూడాలి..