Begin typing your search above and press return to search.

ఒకే హెలీకాప్టర్ లో స్టార్స్ ఆఫ్ కూటమి... మోడీతో పిక్స్ వైరల్!

ఈ సందర్భంగా.. శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం దర్శించుకోనున్నారు.

By:  Raja Ch   |   16 Oct 2025 12:44 PM IST
ఒకే హెలీకాప్టర్  లో స్టార్స్  ఆఫ్  కూటమి... మోడీతో పిక్స్  వైరల్!
X

ఎన్డీఏ ప్రభుత్వం తరపున వరుస ప్రారంభోత్సవాలు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా.. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.


అవును... ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ.. శ్రీశైలం బయల్దేరారు. ఈ సందర్భంగా కర్నూలు ఎయిర్‌ పోర్టులో దిగిన ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం.. ప్రధాని మోడీతో పాటు చంద్రబాబు, పవన్ కలిసి ఒకే హెలికాప్టర్‌ లో శ్రీశైలం వెళ్లారు.


ఈ సందర్భంగా.. శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం దర్శించుకోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నిపెంట వద్ద సుమారు 1,500 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మోడీ సాయంత్రం 4:45 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్తారు.

సభకు భారీగా తరలివెళుతున్న ప్రజలు!:

‘సూపర్ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో గురువారం కర్నూలులో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరైన నేపథ్యంలో... ఈ సభకు పలు ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బస్సుల్లో కర్నూలుకు చేరుకుంటున్నారు. ఈ సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి కూటమి పార్టీల జెండాలతో కదులుతున్న వాహనాలు సందడి చేస్తున్నాయి.

ఆహార పదార్ధాలు అద్భుతః!:

కర్నూలు లో మోడీ సభకు వచ్చే ప్రజల కోసం ఆహార ఏర్పాట్లు చేశారు. కర్నూలులోని పలు ప్రాంతాల్లో ఆహార పొట్లాలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా... నంద్యాల - కర్నూలు రోడ్డులో ఆహార ఏర్పాట్లను మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పరిశీలించారు. ఫుడ్‌ స్టాల్‌ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల వంటకాలు, ఆహార పదార్థాల నాణ్యతను ఆయన పరిశీలించారు.