టాలీవుడ్ బాకీ.. అఖండ తీరుస్తుందా?
ఒకప్పుడంటే ఇండియాలో బాలీవుడ్డే నంబర్ వన్ ఇండస్ట్రీ. కానీ ‘బాహుబలి’ తర్వాత కథ మారిపోయింది. టాలీవుడ్.. బాలీవుడ్నే కాక మిగతా ఇండస్ట్రీలన్నింటినీ వెనక్కి నెట్టి టాప్లోకి వెళ్లిపోయింది
By: Garuda Media | 9 Oct 2025 2:00 AM ISTఒకప్పుడంటే ఇండియాలో బాలీవుడ్డే నంబర్ వన్ ఇండస్ట్రీ. కానీ ‘బాహుబలి’ తర్వాత కథ మారిపోయింది. టాలీవుడ్.. బాలీవుడ్నే కాక మిగతా ఇండస్ట్రీలన్నింటినీ వెనక్కి నెట్టి టాప్లోకి వెళ్లిపోయింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కల్కి’, ‘సలార్’, ‘పుష్ప-2’ లాంటి లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లతో మరే ఇండస్ట్రీ అందుకోలేని స్థాయికి వెళ్లిపోయింది. గత పదేళ్ల జాబితా తీస్తే నంబర్ వన్ గ్రాసర్ టాలీవుడ్ నుంచి వచ్చిన సంవత్సరాలు చాలానే కనిపిస్తాయి. గత ఏడాది కూడా ‘పుష్ప-2’తో టాలీవుడ్దే రికార్డు అయింది. ఐతే 2025లో మాత్రం టాలీవుడ్ వెనుకబడిపోయింది. ఈ ఏడాది మిగతా టాప్ ఇండస్ట్రీల నుంచి ఐదొందల కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు రాబట్టిన సినిమాలున్నాయి.
ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ రికార్డు బాలీవుడ్ పేరిటే ఉంది. ‘చావా’ సినిమాతో రికార్డు బాలీవుడ్ సొంతమైంది. ఆ చిత్రం రూ.790 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ‘సైయారా’ రూపంలో నంబర్-2 స్థానం కూడా బాలీవుడ్దే. ఆ సినిమా రూ.600 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఇక శాండిల్ వుడ్కు ‘కాంతార: చాప్టర్-1’తో భారీ విజయమే దక్కింది. ఈ సినిమా ఇప్పటికే రూ.400 కోట్లు కొల్లగొట్టింది. ఈజీగా ఇంకో రూ.200 కోట్ల వసూళ్లు వచ్చే అవకాశముంది. అంటే శాండిల్వుడ్ కూడా రూ.500 కోట్ల మార్కును దాటబోతున్నట్లే. ఇక కోలీవుడ్ కొన్నేళ్ల నుంచి నంబర్ల రేసులో వెనకబడ్డప్పటికీ.. ‘కూలీ’ రూపంలో ఆ ఇండస్ట్రీకి కూడా రూ.500 కోట్ల ఘనత దక్కింది. మిక్స్డ్ టాక్తోనే ఆ సినిమా ఆ మార్కును అందుకుంది. కానీ టాలీవుడ్ మాత్రం ఇప్పటిదాకా 2025లో రూ.500 కోట్ల మార్కును టచ్ చేయలేదు. ‘ఓజీ’ రూ.350 కోట్ల మార్కు దిశగా అడుగులు వేస్తోంది. రూ.300 కోట్లతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రెండో స్థానంలో ఉంది. ‘రాజా సాబ్’ ఈ ఏడాదే వచ్చేట్లయితే రూ.500 కోట్ల ఘనతే కాదు.. హైయెస్ట్ గ్రాసర్ రికార్డు కూడా సొంతమయ్యేదేమో. కానీ అది జనవరికి వాయిదా పడింది. దీంతో ఇక ఆశలన్నీ ‘అఖండ-2’ మీదే ఉన్నాయి. ఆ సినిమా అంచనాలను అందుకుంటే, పాన్ ఇండియా మ్యాజిక్ వర్కవుట్ అయితే రూ.500 కోట్ల ఘనత సొంతమవుతుందేమో చూడాలి.
