Begin typing your search above and press return to search.

హరాస్మెంట్‌పై ఓపెన్ అయిన నటి.. స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ వైరల్!

సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ప్రముఖ బెంగాలీ నటి రీతాభరి చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Madhu Reddy   |   1 Sept 2026 4:00 AM IST
హరాస్మెంట్‌పై ఓపెన్ అయిన నటి.. స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ వైరల్!
X

సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ప్రముఖ బెంగాలీ నటి రీతాభరి చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరైనా వేధించినా లేదా లైంగిక దాడికి యత్నించినా వారిని వీధుల్లో నగ్నంగా నిలబెడతానంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. గతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ పరిశ్రమలోని కామాంధుల ముసుగులు త్వరలోనే తొలగిపోతాయని ఆమె చేసిన స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర కలకలం రేపుతోంది.ఆ వివరాలు ఇలా వున్నాయి..

లైంగిక వేధింపులపై బెంగాలీ నటి సంచలన వ్యాఖ్యలు:

బెంగాలీ సినిమా రంగంలో నటిగా, నిర్మాతగా, గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రీతాభరి చక్రవర్తి పరిశ్రమలోని వేధింపులపై గళం విప్పారు. "ఏళ్లపాటు వేధింపులు భరించిన తర్వాతే నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన సమయంలో ఏమైనా మాట్లాడితే నన్ను ఎక్కడ బాయ్‌కాట్ చేస్తారోననే భయంతో మౌనంగా ఉన్నాను. కానీ ఇకపై వేధింపులకు పాల్పడే వారిని అస్సలు వదిలేది లేదు, అలాంటి వారిని వీధిలో నగ్నంగా నిలబెడతా" అని ఆమె స్పష్టం చేశారు.

విచారణకు డిమాండ్:

మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై వచ్చిన హేమా కమిటీ నివేదిక తరహాలోనే బెంగాలీ చిత్ర పరిశ్రమలో కూడా బాధితుల కోసం ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని రీతాభరి డిమాండ్ చేశారు. ఇక మహిళలను కేవలం వస్తువులుగా చూసే కామాంధులైన హీరోలు, దర్శకుల అసలు రంగు త్వరలోనే బయటపడుతుందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు.

గతంలోనే ఫిర్యాదు:

రీతాభరి చక్రవర్తి కేవలం మాటలతోనే కాకుండా చట్టపరంగా కూడా పోరాటం చేస్తున్నారు. గత 2024లోనే పరిశ్రమలోని ఇద్దరు ప్రముఖ నిర్మాతలు తనపై చేసిన వేధింపులపై అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నేరుగా ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇక మహిళల భద్రత కోసం పరిశ్రమలో సమూల మార్పులు రావలసిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.

రీతాభరి చక్రవర్తి కెరీర్ అప్‌డేట్స్:

2009లో వచ్చిన ‘ఓగో బోదు సుందరి’ అనే పాపులర్ సీరియల్‌తో నటనా జీవితాన్ని ప్రారంభించిన రీతాభరి బెంగాలీలో 'బ్రహ్మ జానెన్ గోపోన్ కొమ్మొతి', 'ఫటాఫటి' వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇక 2018లో అనుష్క శర్మ నటించిన ‘పరి’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అలాగే ఆయుష్మాన్ ఖురానాతో కలిసి చేసిన ‘ఒర్రే మోన్’ మ్యూజిక్ వీడియో ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రీతాభరి చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. కొత్తగా వచ్చే నటీమణులకు ధైర్యాన్నిచ్చేలా ఆమె మాట్లాడిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ఇండస్ట్రీలో మహిళల రక్షణ కోసం కమిటీలు ఏర్పాటు చేసి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటేనే పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.