'రాజా సాబ్' ప్రభాస్.. ముంబై ఎందుకెళ్లలేదు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ది రాజా సాబ్ మూవీ.. మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: M Prashanth | 5 Jan 2026 3:38 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ది రాజా సాబ్ మూవీ.. మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఆ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఉంది. అయితే రాజా సాబ్ ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ ఈసారి కూడా పరిమితంగానే కనిపిస్తున్నారని చెప్పాలి.
గత కొన్ని సినిమాల నుంచి ఆయన ప్రమోషనల్ ఈవెంట్స్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన తన కెరీర్ లోనే అత్యంత లాంగ్ స్పీచ్ ఇవ్వడం విశేషం. ఆయన కామెంట్స్.. ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రేపాయి.
అయితే ఆ ఒక్క ఈవెంట్ తోనే ప్రభాస్ రాజా సాబ్ ప్రమోషన్స్ ను పూర్తి చేసినట్లు కనిపిస్తున్నారు ప్రభాస్. ఎందుకంటే నేడు (సోమవారం) ముంబైలో సినిమాలోని ఫైనల్ సాంగ్ ను లాంఛ్ చేసింది మువీ టీమ్. అందుకు గాను సినిమా యూనిట్ మొత్తం అక్కడికి వెళ్లింది. దర్శకుడు మారుతి, నిర్మాతలు, నటీనటులు కార్యక్రమానికి హాజరయ్యారు.
కానీ ఆ ఈవెంట్ కు ప్రభాస్ మాత్రం హాజరుకాలేదు. రీసెంట్ గా ఇటలీకి హాలిడే ట్రిప్ కు వెళ్లినట్లు సమాచారం. సినిమా విడుదలకు ముందు విదేశాలకు వెళ్లడం ప్రభాస్ కు కొత్తేమీ కాదు. గతంలో కూడా తన సినిమాల రిలీజ్ కు ముందు ఇలా బ్రేక్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఓ ఇంటర్వ్యూను ముందుగానే రికార్డ్ చేసిన ప్రభాస్.. ఆ తర్వాత నేరుగా హాలిడే ట్రిప్ కోసం ఇటలీ వెళ్లిపోయారట.
సంక్రాంతి తర్వాత.. అంటే రాజా సాబ్ విడుదల అనంతరం ఆయన తిరిగి ఇండియాకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈసారి నార్త్ లో ప్రమోషన్స్ కు ప్రభాస్ హాజరు కాకపోవడం అభిమానుల్లో కొంత నిరాశను కలిగిస్తోంది. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుంటే, కనీసం ఒక్క రోజు అయినా హిందీ ప్రమోషన్స్ కు కేటాయించాల్సిందని అనేక మంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఆయన కొన్ని సినిమాలు తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా, హిందీలో మాత్రం మంచి వసూళ్లు సాధించాయి. అలాంటి మార్కెట్ కోసం రాజా సాబ్ ప్రచారానికి ప్రభాస్ సమయం కేటాయిస్తే మరింత లాభం చేకూరేదని చెప్పాలి. ఏదేమైనా ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నప్పటికీ ప్రభాస్ క్రేజ్ సినిమాకు పెద్ద బలంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక సినిమా విషయానికొస్తే.. దర్శకుడు మారుతి తెరకెక్కించగా, హారర్ ఫాంటసీ జోనర్ లో రూపొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. మరి నార్త్ లో రాజా సాబ్ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.
