Begin typing your search above and press return to search.

“ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ?”… నవదీప్ సంచలన కామెంట్స్!

సమాజంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, తనదైన శైలిలో నటుడు నవదీప్ మాట్లాడే మాటలు బాహాటంగానే చర్చనీయాంశమవుతుంటాయి.

By:  Madhu Reddy   |   25 July 2026 4:12 PM IST
“ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ?”… నవదీప్ సంచలన కామెంట్స్!
X

సమాజంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, తనదైన శైలిలో నటుడు నవదీప్ మాట్లాడే మాటలు బాహాటంగానే చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా విద్యార్థుల నిరసనలు, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మన దేశంలో అభిప్రాయాలను వ్యక్తం చేసేటప్పుడు ఎదురయ్యే పరిస్థితులను, ప్రజాస్వామ్య సూత్రాలను సూటిగా ప్రశ్నిస్తూ ఆయన వేసిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

నీట్ పరీక్షల లీకేజీ అండ్ విద్యార్థుల ఆందోళనలు:

ఇటీవల నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధితులైన విద్యార్థులు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఈ అంశంపై స్పందించిన నవదీప్, విద్యార్థులు పడుతున్న వేదనకు మద్దతుగా నిలిచారు. పవిత్రమైన విద్యా వ్యవస్థలో ఇలాంటి పొరపాట్లు జరగడం వల్ల వేలాది మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని, తమ హక్కుల కోసం విద్యార్థులు ఆందోళన బాట పట్టడం వెనుక ఉన్న ఆవేదనను అందరూ అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.

భావ ప్రకటన స్వేచ్ఛపై సూటి ప్రశ్నలు:

సమాజంలో స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తూ నవదీప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రభుత్వానిది తప్పంటే యాంటీ-నేషనలిస్ట్ అని ముద్ర వేస్తారు. అదే విద్యార్థుల వైపు నిలబడితే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఒక విషయమై మన ఒపీనియన్ చెబితే నీకేం తెలుసని కొట్టిపారేస్తారు.. చెప్పకపోతే నువ్వేం చేయలేదు ఎందుకని నిందిస్తారు! అసలు మన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి?" అని నవదీప్ ప్రశ్నించిన తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది.

‘లవ్ మౌళి’, ‘దండోరా’ లాంటి విభిన్న సినిమాలతో నవదీప్ కొత్తగా కనిపిస్తున్నారు. సినిమాలకే పరిమితం కాకుండా, సామాజిక అంశాలపై కూడా క్లియర్‌గా స్పందించడం ఆయన ప్రత్యేకత.. విమర్శలు వస్తాయని భయపడకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి అభిప్రాయానికి విలువ ఉండాలని ఆయన గళమెత్తడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.ఇక దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది.

నిజాయితీతో కూడిన ప్రశ్నలకు హ్యాట్సాఫ్:

నవదీప్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో వాక్‌స్వాతంత్ర్యం ఎంత కీలకమో మరోసారి గుర్తుచేశాయి. ఇక తప్పును తప్పు అని నిలదీసే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, అభిప్రాయాలు చెప్పిన ప్రతి ఒక్కరినీ విమర్శించడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భయం లేకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన నవదీప్ ధైర్యాన్ని నెటిజన్లు, సినీ అభిమానులు ఎంతగానో అభినందిస్తున్నారు.