Begin typing your search above and press return to search.

మృణాల్ ఆ రిస్క్ చేస్తుందా?

బలగం వంటి ఎమోష‌న‌ల్ సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన వేణు యెల్దండి, ఇప్పుడు ఎల్ల‌మ్మ‌ కోసం కూడా బలమైన కథను సిద్ధం చేశాడనే ప్రచారం ఉంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 May 2026 12:43 PM IST
మృణాల్ ఆ రిస్క్ చేస్తుందా?
X

టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ఒకప్పుడు స్టార్ హీరోయిన్లకు మెయిన్ టార్గెట్ గా ఉండేది. హీరో మార్కెట్, ఓపెనింగ్స్, ఫ్యాన్ బేస్ ఆధారంగానే చాలా మంది హీరోయిన్లు త‌మ కెరీర్ డెసిష‌న్స్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. కథలో పాత్ర బలం, డైరెక్ట‌ర్ విజన్, రెమ్యూన‌రేష‌న్, సినిమా కంటెంట్ వంటి అంశాలు హీరో ఇమేజ్ కంటే ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎల్ల‌మ్మ‌ ప్రాజెక్ట్ చుట్టూ ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

దేవీ శ్రీ ప్ర‌సాద్ హీరోగా ఎల్ల‌మ్మ‌

ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, డైరెక్ట‌ర్ వేణు యెల్దండి తెరకెక్కించనున్న ఎల్ల‌మ్మ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీశ్రీ ప్రసాద్ హీరోగా నటించనున్నాడనే విషయం సినిమాపై ప్రత్యేక దృష్టిని తీసుకొచ్చింది. సాధారణంగా స్టార్ హీరోయిన్‌లు డెబ్యూ హీరోలతో సినిమాలు చేయడంలో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎందుకంటే సినిమా రిజ‌ల్ట్, కెరీర్ ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే ఎల్ల‌మ్మ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ హీరో కంటే కథ, పాత్రలు, డైరెక్ట‌ర్ నమ్మకం ప్రధానంగా నిలుస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఎల్ల‌మ్మ కోసం స్ట్రాంగ్ స్టోరీని రెడీ చేసిన వేణు

బలగం వంటి ఎమోష‌న‌ల్ సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన వేణు యెల్దండి, ఇప్పుడు ఎల్ల‌మ్మ‌ కోసం కూడా బలమైన కథను సిద్ధం చేశాడనే ప్రచారం ఉంది. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ క్యారెక్ట‌ర్ కు భారీ ప్రాధాన్యం ఉంటుందని, ఇది పూర్తిగా ఆథర్ బ్యాక్డ్ రోల్‌గా రూపొందుతోందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇలాంటి పాత్రలకే గత కొంతకాలంగా మృణాల్ ఠాకూర్ ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. సీతారామం తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో క్లాస్ పెర్ఫార్మర్ అనే ఇమేజ్ ఏర్పడింది. గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, ఎమోష‌న్స్ కు స్కోప్ ఉన్న పాత్రల్లో నటించాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎల్లమ్మ కథ ఆమెను ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఎల్ల‌మ్మ వెనుక దిల్ రాజు వ్యూహం

ఇక ఈ ప్రాజెక్ట్ వెనుక నిర్మాత దిల్ రాజు వ్యూహం కూడా ఆసక్తికరంగా మారింది. మొదట నాని హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా అనుకున్న ఈ సినిమా ఇప్పుడు పూర్తిగా కొత్త ట్రాక్‌లోకి వెళ్లింది. నాని ది ప్యారడైజ్ వైపు మొగ్గుచూపడంతో ఎల్ల‌మ్మ నుంచి తప్పుకున్నాడని, ఆ తర్వాత సాయి పల్లవి కూడా ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లిందనే ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి మృణాల్‌ను ఒప్పించాలనే ప్రయత్నం జరుగుతోందని టాక్. అంటే హీరో మార్కెట్‌పై కాకుండా, బలమైన కథకు సరిపోయే నటీనటులను తీసుకుని సినిమాను నిలబెట్టాలని దిల్ రాజు ఆలోచన చేస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతుంది.

ఇది మరో కీలక మార్పుకు కూడా సంకేతంగా కనిపిస్తోంది. గతంలో స్టార్ హీరో లేకుండా భారీ సినిమాలు ఊహించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు కథే ప్రధాన బలం అనే నమ్మకం పెరుగుతోంది. ముఖ్యంగా హీరోయిన్‌లు కూడా కేవలం స్టార్ హీరో కాంబినేషన్ కంటే, తమ పాత్రకు ఉన్న ప్రాధాన్య‌త‌, స్క్రీన్ స్పేస్, యాక్టింగ్ కు స్కోప్ ఉండే క‌థ‌ల‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తున్నార‌ని తెలుస్తోంది. అందుకే డెబ్యూ హీరో అయిన దేవీశ్రీ ప్రసాద్‌తో నటించడం రిస్క్ అయిన‌ప్ప‌టికీ, కథ బలంగా ఉంటే మృణాల్ వంటి హీరోయిన్‌లు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, ఎల్లమ్మ సినిమా మృణాల్ ఠాకూర్ కెరీర్‌లో మరో కీలక మలుపు కావచ్చనే చర్చ కూడా నడుస్తోంది. కంటెంట్ ఆధారిత సినిమాలు వరుసగా సక్సెస్ అవుతున్న ఈ సమయంలో, సరైన కథతో వచ్చిన బలమైన పాత్ర ఆమెను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మ‌రి వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని మృణాల్ ఎల్ల‌మ్మ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందో లేదో చూడాలి.