Begin typing your search above and press return to search.

కార్తి కెరీర్‌లో స్పెషల్ మూవీ.. స్టార్ డైరెక్టర్‌తో కొత్త ప్రయోగం!

బాక్సాఫీస్ వద్ద తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న కార్తి, కమర్షియల్ మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన మోహన్ రాజా కాంబినేషన్ కుదరడం ఇదే తొలిసారి.

By:  Madhu Reddy   |   3 Aug 2026 3:57 PM IST
కార్తి కెరీర్‌లో స్పెషల్ మూవీ.. స్టార్ డైరెక్టర్‌తో కొత్త ప్రయోగం!
X

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి విభిన్నమైన కథలతో ఎప్పుడు అలరించే హీరో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ముందుకు రాబోతున్నారు. రీసెంట్‌గా 'సర్దార్ 2' అప్‌డేట్‌లతో సందడి చేసిన ఆయన, తాజాగా స్టైలిష్ ఎంటర్‌టైనర్స్ తీసే డైరెక్టర్ మోహన్ రాజాతో చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబోను నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో కార్తి, మోహన్ రాజా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..ఆ వివరాలు చూద్దాం..

తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో కార్తి-మోహన్ రాజా:

బాక్సాఫీస్ వద్ద తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న కార్తి, కమర్షియల్ మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన మోహన్ రాజా కాంబినేషన్ కుదరడం ఇదే తొలిసారి. ఇక భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, అన్ని కమర్షియల్ అంశాలతో రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

మోహన్ రాజా మూడో ఒరిజినల్ స్క్రిప్ట్:

మెగాస్టార్ చిరంజీవితో 'గాడ్‌ఫాదర్' తీసిన తర్వాత మోహన్ రాజా చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. రీమేక్ సినిమాలతో పాటు 'తని ఒరువన్', 'వేలైక్కారన్' వంటి సొంత కథలతో సంచలన విజయాలు సాధించిన ఆయన, ఇప్పుడు మూడోసారి తన సొంత కథతో కార్తి కోసం ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అంచనాలు పెరిగిపోయాయి.

ప్రిన్స్ పిక్చర్స్‌తో నాలుగోసారి:

ఇక నిర్మాత ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం కార్తితో వారికి నాలుగో ప్రాజెక్ట్. గతంలో వీరి కాంబినేషన్‌లో 'దేవ్', 'సర్దార్' మూవీస్ రాగా, 'సర్దార్ 2' ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇక ఈ కాంబో సక్సెస్ ట్రాక్ చూస్తుంటే ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా భారీ హిట్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

2026 చివరి నాటికి షూటింగ్ ప్రారంభం:

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్‌ను 2026 చివరి నాటికి పట్టాలెక్కించేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది.

బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ రచ్చ:

కార్తి నటన, మోహన్ రాజా డైరెక్షన్ మార్క్ కలగలిపితే థియేటర్లలో వినోదాల విందు ఖాయం. కథపై మంచి నమ్మకంతో వస్తున్న ఈ కాంబో వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే..