Begin typing your search above and press return to search.

సార్ కాంబో రిపీట్.. ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా?

ప్రస్తుతం ఆయన 55వ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన 'ఫస్ట్ స్ట్రైక్' టీజర్‌లో ధనుష్ రౌద్రం, మాస్ అవతార్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు.

By:  Madhu Reddy   |   29 July 2026 7:05 PM IST
సార్ కాంబో రిపీట్.. ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా?
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘సార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మళ్లీ కలవబోతుందనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది.ఈసారి వెంకీ అట్లూరి, ధనుష్ కోసం ఒక విభిన్నమైన పోలీస్ బ్యాక్‌డ్రాప్ కథను సిద్ధం చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ విశేషాలు చూద్దాం..

'సార్' మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుందా?:

సామాజిక సందేశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ కలగలిపి 'సార్' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టారు ధనుష్-వెంకీ. ఆ సినిమాలో లెక్చరర్‌గా మెప్పించిన ధనుష్, ఈసారి వెంకీ అట్లూరి కాంబోలో పూర్తి విభిన్నమైన పాత్రలో రాబోతున్నారు. తాజా ఓ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ధనుష్‌కు పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక స్టోరీ చెప్పానని, ప్రస్తుతం ఆ కథకు సంబంధించి తీవ్రమైన రీసెర్చ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

'ఓం'తో ధనుష్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం ఆయన 55వ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన 'ఫస్ట్ స్ట్రైక్' టీజర్‌లో ధనుష్ రౌద్రం, మాస్ అవతార్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక ఈ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌ను 2026 అక్టోబర్ 16న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

భారీ తారాగణంతో ‘ఓం’ సినిమా ఆకట్టుకుంటోంది.

ఇందులో మమ్ముట్టి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించగా, ‘మారి 2’ తర్వాత ధనుష్-సాయి పల్లవి జంట మళ్లీ అలరిస్తోంది. వీరికి తోడు క్రేజీ బ్యూటీ శ్రీలీల కూడా ముఖ్య పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక 'ఓం' సినిమా పూర్తయిన వెంటనే వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఇక వెంకీ అట్లూరీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ఈ భారీ చిత్రంలో యువ కథానాయిక మమితా బైజు హీరోయిన్‌గా అలరించనుండగా, సీనియర్ నటీమణులు రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక రాబోయే ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధమవుతుండగా, ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలను, మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

మరో క్లాసిక్ హిట్ కాంబో:

‘సార్’తో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన ధనుష్-వెంకీ అట్లూరి, ఈసారి పోలీస్ కథతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నారోనని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ధనుష్ ఖాతాలో ఈ సినిమా మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందో లేదో చూడాలి.