Begin typing your search above and press return to search.

హిట్ అయినా చీవాట్లు త‌ప్ప‌లేద‌న్న హీరోయిన్!

కానీ సినిమా చూసిన చాలా మంది త‌న‌ని తిట్టుకున్నార‌ని అభిప్రాయ ప‌డింది. ప్ర‌ణ‌వ్ లాల్ ప‌క్క‌న తాను సెట్ అవ్వ‌లేద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కుట‌న్న‌ట్లు తెలిపింది.

By:  Srikanth Kontham   |   21 Aug 2025 6:00 AM IST
హిట్ అయినా చీవాట్లు త‌ప్ప‌లేద‌న్న హీరోయిన్!
X

సినిమా హిట్ అయితే ప్ర‌శంస‌లు స‌హ‌జం. ఏ న‌టికైనా హిట్ మాత్ర‌మే కీల‌కం. విజ‌యం ముంగిట అన్ని చిన్న‌బోతాయి. విమ‌ర్శ అనే మాటే వ్య‌క‌మ‌వ్వ‌దు. కానీ మ‌ల‌యాళం బ్యూటీ ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్ మాత్రం విజ‌యం అందుకున్నా? ప్ర‌శంస‌తో పాటు విమ‌ర్శ‌లు..చీవాట్లు కూడా తిన్న న‌టిగా పేర్కొంది. మ‌ల‌యాళ చిత్రం `హృద‌యం` లో అమ్మ‌డు ప్రణ‌వ్ లాల్ కి జోడీగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. యూత్ పుల్ స్టోరీ మంచి విజ‌యం సాధించింది. `ద‌ర్శ‌నా` సాంగ్ తో తెలుగింట బాగా పాపుల‌ర్ అయింది.

మ‌న‌సు గాయ‌ప‌డేలా:

కానీ సినిమా చూసిన చాలా మంది త‌న‌ని తిట్టుకున్నార‌ని అభిప్రాయ ప‌డింది. ప్ర‌ణ‌వ్ లాల్ ప‌క్క‌న తాను సెట్ అవ్వ‌లేద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కుట‌న్న‌ట్లు తెలిపింది. ఇండ‌స్ట్రీలో కొంద‌రు త‌న ముందు మాట్లా డ‌క‌పోయినా? వెన‌క విమ‌ర్శ‌లు చేసారంది. ఆ విమ‌ర్శ‌ల‌కు తానెంతో బాధ‌ప‌డిన‌ట్లు తెలిపింది. సినిమా హిట్ అయింది కాబ‌ట్టి ఆ మాత్ర‌మైనా ఉండ‌గ‌లిగాన‌ని, లేదంటే? మ‌రిన్ని విమ‌ర్శ‌ల‌తో మ‌న‌సు మ‌రింత గాయ‌ప‌రిచేవారంది. త‌న అందాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్లు మాత్రం త‌న‌ని ఎంత‌గానో బాధ‌పెట్టాయ‌ని , కొన్ని రోజుల పాటు ఆ మాట‌లు గుర్తొచ్చి క్షోభ‌కు గురైన‌ట్లు తెలిపింది.

విమ‌ర్శ‌లు స‌హ‌జం:

సోషల్ మీడియాలో వ‌చ్చిన ప్ర‌తీ కామెంట్ చ‌దివాన‌ని తెలిపింది. అయితే ఎన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కున్నా? ఏ నాడు ఆత్మ విశ్వాసం కోల్పోలేద‌ని , న‌ట‌నా రంగంలో ఇలాంటివి స‌హ‌జంగా భావించి ముందు కెళ్తు న్న‌ట్లు తెలిపింది. తాజాగా ఈ బ్యూటీ `ప‌రదా` సినిమాతో టాలీవుడ్ లో రీలాంచ్ అవుతోంది. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ద‌ర్శ‌న రాజేంద్ర‌న్ కీల‌క పాత్ర పోషిస్తుంది.

ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్ మంచి పెర్పార్మ‌ర్ కావ‌డంతోనే `ప‌ర‌దా`లో ఛాన్స్ ఇచ్చిన‌ట్లు ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ కండ్రేగుల తెలిపారు.

ప‌దేళ్ల క్రిత‌మే టాలీవుడ్ లో:

`ప‌ర‌దా` కంటే ముందే అమ్మ‌డు ప‌దేళ్ల క్రితమే తెలుగు లో ఎంట్రీ ఇచ్చింది. `మూడు ముక్క‌ల్లో చెప్పా లంటే` అనే సినిమాలో న‌టించింది. సినిమాలో కీర్తి పాత్ర పోషించింది. త‌మిళ్ , తెలుగులో ఈ చిత్రాన్ని మ‌ధు మిత తెర‌కెక్కించారు. ఎస్. పి చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని సాధించ‌లేదు. మ‌రి `ప‌ర‌దా`తోనైనా ద‌ర్శ‌న టాలీవుడ్ కెరీర్ ప‌ట్టాలెక్కుతుందేమో చూడాలి. కానీ తెలుగు ప‌రిశ్ర‌మ‌లో న‌టీమ‌ణుల మ‌ధ్య పోటీ ఎలా ఉందో తెలిసిందే. ఆ పోటీని త‌ట్టుకుని ద‌ర్శ‌న నిల‌బ‌డాలి సుమీ.