సుమ కొడుకు గ్లింప్స్.. బండి సరోజ్ ఆవేదన.. ఏం జరిగింది?
అయితే మోగ్లీ 2025లో పబ్లిక్ స్టార్ బండి సరోజ్ విలన్ గా కనిపించనున్నారు. రీసెంట్ గా స్టార్ హీరో రామ్ చరణ్ రిలీజ్ చేసిన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
By: M Prashanth | 1 Sept 2025 1:33 PM ISTయాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల ఇప్పుడు హీరోగా మోగ్లీ 2025 మూవీలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో సాక్షి మడోల్కర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
అయితే మోగ్లీ 2025లో పబ్లిక్ స్టార్ బండి సరోజ్ విలన్ గా కనిపించనున్నారు. రీసెంట్ గా స్టార్ హీరో రామ్ చరణ్ రిలీజ్ చేసిన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అందులో బండి సరోజ్ యాక్షన్ పై ప్రశంసలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు బండి సరోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు.. సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
మోగ్లీ గ్లింప్స్ కు గాను తనను మెచ్చుకుంటూ సోషల్ మీడియా యూజర్లు పెట్టిన కామెంట్స్ ను డిలీట్ చేయిస్తున్నారంటూ ఆరోపించారు. సినిమా కోసం ఎంతగానే కష్టపడ్డానని తెలిపారు. గ్లింప్స్ కు గాను తాను ఉన్నాననే రీసెంట్ గా ఏకంగా థంబ్ నెయిల్ ను మార్చేశారని చెప్పారు. తన వద్ద అన్ని ఫ్రూఫ్స్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
''కామెంట్స్ ఏ కదా... లైట్ తీసుకోమని చెప్పేవాళ్ళకి. నేను బయట సినిమాలు ఇప్పటి వరకూ ఒప్పుకోలేదు. సందీప్ రాజ్ ఒత్తిడితో కథ విన్నాక, నా పాత్ర నచ్చి అందులో ఎటువంటి మార్పులు ఉండకూడదు అనే అగ్రిమెంట్ తో పారితోషికం లేకుండా ప్రాణం పెట్టి నటించాను. 8 నెలలు నా సమయాన్ని ఇచ్చాను'' అని అన్నారు.
''నాకు వస్తున్న రిసెప్షన్ చూసి ముందు థంబ్ నెయిల్స్ మార్చారు. తర్వాత కామెంట్స్ ఆఫ్ చేశారు. నేను దర్శకుడితో మాట్లాడాక మళ్ళీ ఆన్ చేశారు. ఒక 3 కామెంట్లను బాట్ లైక్స్ తో బూస్ట్ చేసి, నా రోల్ కి వస్తున్న ఆదరణను మ్యాచ్ చేయడానికి చూశారు. కుదరలేదు. ఇప్పుడు నా టాప్ కామెంట్లు డిలీట్ చేశారు'' అని తెలిపారు.
''ఇంకా డిటైల్డ్ గా ప్రూఫ్స్ తో ముందుకు వస్తాను. ఇప్పటికీ అక్కడ ఉన్న 1600 కామెంట్లలో 99% నా పైన ప్రేక్షకుడు పలికించిన ప్రేమే. నాకు పీఆర్ లు లేరు. ప్రేక్షకుడి బలమే నా పీఆర్. ఆ సునామీని ఎవ్వడూ ఆపలేరు. కానీ వీళ్లు ఇప్పుడే ఇలా చేస్తే, రేపు సినిమాలో ఎన్ని చేస్తారు. ఎవరిని నమ్మాలి'' అని బండ్ సరోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
''నిర్మాత వరకూ వెళ్ళే అవకాశం నాకు లేదు. నేను ఇండస్ట్రీలో బ్రతికేయడానికి రాలేదు. గత 5 సంవత్సరాలుగా నా కళతో నేను ప్రేక్షకుల్ని సంపాదించుకున్నాను. ఇలాంటి ఇన్ సెక్యూర్ నెపోటిజం, పాలిటిక్స్ ని నేను అస్సలు బేర్ చెయ్యను. ఏం చేశారో బయటపెడతా. నిర్మాత విశ్వప్రసాద్ తీవ్రంగా పరిశీలించాలని కోరుతున్నాను'' అని చెప్పారు.
''ఇది నిర్మాత ప్రమేయం లేకుండా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చౌకబారు బంధుప్రీతికి అడ్డాగా ఎప్పుడూ ఉండకూడదు. అందుకు ఇప్పుడు నా బాధ, భవిష్యత్తు కెరీర్ పై ఏర్పడిన భయాన్ని మీరు కచ్చితంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను'' అని బండి సరోజ్ కుమార్ పోస్ట్ లో తెలిపారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
