ఆలియా-పీసీ ఈ ఘనత చాలదు.. ప్రపంచ శాంతి నినాదం ముఖ్యం!
భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటీమణులు ఆలియా భట్, ప్రియాంక చోప్రాలకు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.
By: Sivaji Kontham | 19 March 2026 12:00 AM ISTభారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటీమణులు ఆలియా భట్, ప్రియాంక చోప్రాలకు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.`నేషనల్ జియోగ్రాఫిక్` ప్రకటించిన ప్రతిష్టాత్మక `33 గ్లోబల్ ఛేంజ్మేకర్స్` జాబితాలో వీరిద్దరూ చోటు సంపాదించుకున్నారు. కేవలం వెండితెరపై నటనకే పరిమితం కాకుండా.. సమాజంలో సానుకూల మార్పు కోసం వీరు చేస్తున్న కృషిని ఈ గుర్తింపు అభినందిస్తోంది. ఈ అంతర్జాతీయ గౌరవం దక్కడంపై భారతీయ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్లోబల్ ఫేసెస్ గా ఎదిగిన ఈ ఇద్దరు కథానాయికలు ఇప్పుడు కేవలం నటీమణులు మాత్రమే కాదు.. ప్రపంచం గమనిస్తున్న ప్రభావవంతమైన వ్యక్తులు. అయితే కేవలం సామాజిక మార్పులకే పరిమితం కాకుండా.. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా వీరు మరింత బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ముఖ్యంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఆలియా, ప్రియాంక వంటి సెలబ్రిటీలు తమ గళాన్ని విప్పాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
``ఆలియా-పీసీ.. ఈ గుర్తింపు చాలదు.. ప్రపంచ శాంతి నినాదంతో ముందుకు సాగాలి`` అంటూ అభిమానులు తమ ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై వీరికి ఉన్న క్రేజ్ , ఫాలోయింగ్ సామాన్యమైనది కాదు. అందుకే యుద్ధం లేని ప్రపంచం కోసం, గ్లోబల్ పీస్ కోసం వీరు తమ వంతు కృషి చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇలాంటి ప్రముఖులు శాంతి గురించి మాట్లాడితే అది ప్రపంచ దేశాలల మారుమూలకు కూడ చేరే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై ఈ అంశంపై ఆసక్తికరమైన డిబేట్లు జరుగుతున్నాయి. సెలబ్రిటీలు కేవలం బ్రాండ్ అంబాసిడర్లుగానో లేదా ఫ్యాషన్ ఐకాన్లుగానో ఉండటమే కాకుండా.. మానవత్వం కోసం పరితపించే గ్లోబల్ పీస్ అంబాసిడర్లుగా మారాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలాంటి ప్రభావవంతమైన వ్యక్తులు బహిరంగ వేదికల ద్వారా ప్రశాంతతను, సామరస్యాన్ని కోరడం వల్ల సమాజంలో ఒక గొప్ప సందేశం వెళ్తుందని వారు విశ్లేషిస్తున్నారు.
అయితే ప్రియాంక చోప్రా ఇప్పటికే గ్లోబల్ అంబాసిడర్ గా ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన నటి. అందుకే తన ప్రచారం ప్రతిదీ వేగంగా ప్రజలకు చేరువవుతుంది. ఆలియా భట్, ప్రియాంక చోప్రా వంటి ప్రతిభావంతులు దక్కించుకున్న ఈ `గ్లోబల్ ఛేంజ్మేకర్స్` గుర్తింపు వారి బాధ్యతను మరింత పెంచింది. కేవలం గ్లామర్ ప్రపంచానికే కాకుండా.. లోక కల్యాణం కోసం తమ వంతు స్వరాన్ని వినిపిస్తే వీరి కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. యుద్ధం అనే భయం లేని ప్రశాంతమైన ప్రపంచం కోసం వీరు చేసే ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఆలియా, ప్రియాంక చోప్రా ఇద్దరూ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న కథానాయికలు. పీసీ ఇప్పటికే రాజమౌళి సినిమా వారణాసిలో నటిస్తుండగా, ఆలియా భట్ `లవ్ అండ్ వార్` సహా ఆల్ఫా అనే గూఢచారి నేపథ్య చిత్రంలో నటిస్తున్నారు.
