అన్ఫాలోతో రచ్చ.. విజయ్, త్రిష రిలేషన్పై క్లారిటీ ఏంటి?
అసలు త్రిష ఎందుకు అన్ఫాలో చేసింది? ఈ వైరల్ వార్త వెనకున్న అసలు కథ ఇప్పుడు తెలుసుకుందాం..
By: Madhu Reddy | 23 Jun 2026 1:06 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్, గ్లామర్ క్వీన్ త్రిష కాంబినేషన్కు ఉండే క్రేజే వేరు. వీరిద్దరూ లవ్ లో ఉన్నారంటూ గతంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా విజయ్ పుట్టినరోజున త్రిష విషెస్ చెప్పకపోవడం, పైగా ఇన్స్టాగ్రామ్లో ఆయన్ని అన్ఫాలో చేయడంతో వీరి రిలేషన్ బ్రేక్ అయిందా అనే చర్చ మొదలైంది. అసలు త్రిష ఎందుకు అన్ఫాలో చేసింది? ఈ వైరల్ వార్త వెనకున్న అసలు కథ ఇప్పుడు తెలుసుకుందాం..
బర్త్డే విషెస్ లేవు.. అన్ఫాలో వైరల్:
రీసెంట్గా జరిగిన విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అయితే అందరూ త్రిష నుంచి వచ్చే స్పెషల్ పోస్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ రోజు గడిచినా త్రిష నుంచి ఎలాంటి పోస్ట్ రాలేదు. పైపెచ్చు, ఆమె విజయ్ను ఇన్స్టాలో అన్ఫాలో చేసిందనే వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా రచ్చ మొదలైంది.
అసలు అన్ఫాలో ఎప్పుడు జరిగింది?:
త్రిష ఇప్పుడు సడన్గా విజయ్ను అన్ఫాలో చేసిందని అందరూ అనుకుంటున్నారు కానీ, తమిళ మీడియా ప్రకారం ఆమె ఈ ఏడాది మార్చిలోనే ఆ నిర్ణయం తీసుకుందట. ఇక విజయ్ భార్య సంగీత కోర్టులో విడాకుల పిటిషన్ వేసినట్లు వార్తలు వచ్చినప్పుడు, నెటిజన్లు కొందరు త్రిషను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఇక ఆ ట్రోలింగ్ భరించలేకే త్రిష అప్పట్లోనే విజయ్ను అన్ఫాలో చేసిందని క్లారిటీ వస్తోంది.
పీక్ స్టేజ్లో త్రిష కెరీర్:
ఒకపక్క విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉంటే, త్రిష కెరీర్ పరంగా ఫుల్ ఫామ్లో దూసుకుపోతోంది. రీసెంట్గా సూర్య సరసన నటించిన 'వీరభద్రుడు' మూవీతో మంచి హిట్ అందుకుంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి పక్కన 'విశ్వంభర' సినిమా కూడా పూర్తి చేసింది. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్లే ఆమె ఇలాంటి రూమర్లను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
విజయ్, త్రిష మధ్య రిలేషన్ బ్రేక్ అయిందనే వార్తలకు అన్ఫాలో వ్యవహారం మరింత ఆజ్యం పోసింది. అయితే త్రిష స్వయంగా స్పందించి క్లారిటీ ఇస్తే తప్ప ఈ సోషల్ మీడియా చర్చలకు పుల్స్టాప్ పడేలా లేదు. ఏదేమైనా, ఇన్నాళ్లూ స్క్రీన్ పై మ్యాజిక్ చేసిన ఈ హిట్ జోడీ మధ్య ఇలాంటి రూమర్స్ రావడం ఫ్యాన్స్ను నిరాశపరుస్తుంది..
