Begin typing your search above and press return to search.

బీచ్ లో బికినీతో హీట్ పుట్టిస్తున్న దృశ్యం పాప.. ఫోటోలు వైరల్!

ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో అలరించే ఈమె.. తాజాగా బికినీ అందాలతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

By:  Madhu Reddy   |   10 Aug 2025 2:24 PM IST
బీచ్ లో బికినీతో హీట్ పుట్టిస్తున్న దృశ్యం పాప.. ఫోటోలు వైరల్!
X

దృశ్యం 2013లో మోహన్ లాల్, మీనా, ఆశా శరత్, సిద్ధిక్ తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం 'దృశ్యం'. మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా రీమేక్ చేశారు. అలా 2014లో సురేష్ ప్రొడక్షన్స్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా దృశ్యం సినిమాను రీమేక్ చేశారు. ఫ్యామిలీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో మీనా , వెంకటేష్ జంటగా నటించగా.. నదియా, నరేష్, ఎస్తర్ అనిల్, కృతిక జయకుమారి , చైతన్య కృష్ణ, సమీర్, రవికాలే , సప్తగిరి, రోషన్ బషీర్, చలపతిరావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి 1980లో నటిగా ఒక వెలుగు వెలిగిన శ్రీప్రియ దర్శకత్వం వహించింది.

ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ కూతురుగా నటించిన ఎస్తర్ అనిల్ తన అద్భుతమైన నటనతో మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె వయసు 23 ఏళ్లు.. ఈమె అందాల ప్రదర్శన చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . దృశ్యం సినిమాలో అమాయకంగా కనిపించిన అమ్మాయి ఏంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు . ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో అలరించే ఈమె.. తాజాగా బికినీ అందాలతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

ప్రస్తుతం ఈమె క్రోయోషియాలోనీ ఒక ద్వీపం అయిన యూరో కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడి నుండి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందులో బ్లాక్ బికినీ ధరించి, సరోంగ్ తో తన అందాలను కప్పివేసింది. మరొక ఫోటోలో అందాలు మొత్తం బయట పెట్టేస్తూ సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ప్రస్తుతం ఎస్తర్ అనిల్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి. ఈ అమ్మడిని చూసి పలువురు పలురకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ఎస్తర్ కెరీర్ విషయానికి వస్తే.. 2010లో 'నల్లవన్' అనే మలయాళ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. 2013లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా - థ్రిల్లర్ మూవీగా వచ్చిన దృశ్యం తో పాటు దాని సీక్వెల్ దృశ్యం 2లో కూడా నటించి ఆకట్టుకుంది. 2016లో ఉత్తమ బాలనటిగా కేరళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు కూడా అందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిన ఈమె తొలిసారి నటించిన చిత్రం కుజలి. ఇది తమిళ్ చిత్రం. కానీ విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత 'జోహార్' అనే తెలుగు సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించింది.

టెలివిజన్ సిరీస్ లలో కూడా పనిచేసింది. అలా 2018లో ప్రసారమైన టాప్ సింగర్ షో కి హోస్ట్ గా వ్యవహరించింది. ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న ఎస్తర్.. మరొకవైపు ఇలా వెకేషన్ లో బికినీ అందాలతో రచ్చ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారే ప్రయత్నం చేస్తోంది.