Begin typing your search above and press return to search.

ఎఫైర్ పై నిలదీసిన మామ.. కోడలు ఎంత పనిచేసిందంటే?

అటువంటి షాకింగ్ ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది.

By:  A.N.Kumar   |   2 Feb 2026 7:00 PM IST
ఎఫైర్ పై నిలదీసిన మామ.. కోడలు ఎంత పనిచేసిందంటే?
X

అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని పెద్దల సమక్షంలో దాంపత్య బంధంలోకి అడుగుపెట్టి పిల్లలను కని కుటుంబాన్ని కొనసాగించడమే వివాహ వ్యవస్థ యొక్క అసలు లక్ష్యం. కష్టసుఖాల్లో భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా నిలవాల్సిన ఈ పవిత్ర బంధం నేటి సమాజంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, పరస్పర గౌరవం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది.

ఈ లోటే వివాహేతర సంబంధాలకు దారితీస్తోంది. మొదట రహస్యంగా మొదలయ్యే ఈ అనైతిక బంధాలు, చివరకు కుటుంబాలను కూల్చివేసే స్థాయికి చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవి దారుణమైన నేరాలకు, ప్రాణనష్టం జరిగే పరిస్థితులకు కూడా కారణమవుతున్నాయి. ఇటువంటి ఘటనలు ఇటీవల దేశవ్యాప్తంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

అటువంటి షాకింగ్ ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడ నివసిస్తున్న ఓ మహిళ, తన భర్తకు తెలియకుండా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం క్రమంగా ఆమె మామకు తెలిసింది. దీంతో ఆయన కోడలిని నిలదీసి ఇది సరికాదని ఇలాంటి వ్యవహారాల వల్ల కుటుంబ పరువు మంటగలిసిపోతుందని హెచ్చరించారు.

కానీ తన అక్రమ సంబంధానికి మామ అడ్డుగా మారడంతో ఆ కోడలు తీవ్ర అసహనానికి గురైంది. ఈ విషయాన్ని తన ప్రియుడితో చర్చించిన ఆమె, చివరకు మామను చంపేయాలనే ఘోర నిర్ణయానికి వచ్చింది. ఇందుకు ప్రియుడి సహకారం తీసుకుంది.

ప్లాన్ ప్రకారం మామ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో అతనిపై పెట్రోల్ పోసి, వెంటనే నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి అతని శరీరం మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో అతడికి సుమారు 70 శాతం తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. మంటల తాకిడిని తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బైక్ నడపలేని స్థితిలో కొంత దూరం కాలిన శరీరంతోనే నడుచుకుంటూ రావడం అక్కడున్నవారిని భయాందోళనలకు గురిచేసింది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను చూసినవారికి ఒళ్లు గగుర్పొడిచే పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో బాధితుడి కోడలు, ఆమె ప్రియుడు సహా మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు తమిళనాడు మీడియా వెల్లడిస్తోంది.

వివాహేతర సంబంధాలు ఎలా ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజాన్నే వణికించే నేరాలకు దారి తీస్తాయో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. చిన్న తప్పు అనుకున్న నిర్ణయం, చివరకు ప్రాణాల మీదికి తెచ్చే ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందన్నదానికి ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది.