Begin typing your search above and press return to search.

ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ పై తీవ్ర ఆరోపణలు... వీడియో వైరల్!

గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఏకపక్షంగా ఒక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   12 April 2024 1:30 PM GMT
ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ పై తీవ్ర ఆరోపణలు... వీడియో వైరల్!
X

గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఏకపక్షంగా ఒక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే! మ్యాచ్ ముందు హోరా హోరీ పోరు తప్పదని భావించిన నేపథ్యంలో... ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ మ్యాచ్ కాస్తా ఏకపక్షంగా మారిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో... ముంబై బ్యాటర్లు బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు. ఈ సమయంలో ఈ మ్యాచ్ పై సరికొత్త ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి!

అవును... ముంబై ఇండియన్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఎంఐ బ్యాటర్స్ చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇషాన్‌ కిషన్‌ (69: 34 బంతుల్లో 7×4, 5×6), సూర్యకుమార్‌ (52: 19 బంతుల్లో 5×4, 4×6)ల విధ్వంసక బ్యాటింగ్‌ తో భారీ లక్ష్యాన్ని సైతం ముంబయి 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

అయితే ఊహించని విధంగా ముంబై ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య గురువారం జరిగిన మ్యాచ్ పై పలువురు అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా టాస్ సమయంలో జరగకూడనిది ఏదో జరిగిందని అంటున్నారు. ఈ మేరకు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ పై సరికొత్త ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇందులో భగంగా... జవగల్ శ్రీనాథ్ టాస్ ఫలితాలు తారుమారు చేశారంటూ ఒక వీడియో ఇప్పుడు సొషల్ మీడియాలో వైరల్ అవుతోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... టాస్ ఫలితాన్ని మార్చేలా శ్రీనాథ్ కాయిన్ ను ఫ్లిప్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో... ఈ ఐపీఎల్ సీజన్ 17లో తొలిసారి వివాదాస్పద అంశం తెరపైకి వచ్చినట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు!