Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రిపై యువకుల సిరా దాడి...

By:  Tupaki Desk   |   15 Oct 2019 1:35 PM GMT
కేంద్రమంత్రిపై యువకుల సిరా దాడి...
X
కేంద్ర వైద్య - ఆరోగ్య సహాయ మంత్రి అశ్వినీ చౌబేకు ఊహించని షాక్ తగిలింది. గుర్తు తెలియని ఇద్దరు యువకులు ఆయనపై సిరా చల్లారు. ఈ ఘటనలో ఆయన చొక్కాతో పాటు కారుపై సిరా మరకలు పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..ఇటీవల వరదలు బీహార్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అయితే వరదలు తగ్గుముఖం పట్టిన - అశుభ్రత - మురికి - దోమలు వల్ల ప్రజలు రోగాల భారీన పడుతున్నారు. దోమలు వల్ల రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరిగిపోయాయి.

ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి పాట్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో డెంగ్యూ రోగులను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే మంత్రి కారు పార్క్ చేసి హాస్పిటల్ లోపలకి వెళ్ళే సమయంలో గుర్తు తెలియని ఇద్దరు యువకులు ఆయనపై సిరా చల్లారు. సిరా చల్లిన వెంటనే ఆ యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత మంత్రి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రజలు అనారోగ్య భారిన పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే దానిపై యువకులు నిరసన వ్యక్తం చేస్తూ ఈ విధంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఘటనపై కేంద్ర మంత్రి చౌబే స్పందిస్తూ… ఇది తనపై జరిగిన దాడి కాదని.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల చౌబే పోలీసులకు వార్నింగ్ ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారంటూ ఓ పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించిన చౌబే.... ఒంటిపై పోలీసు దుస్తులు లేకుండా చేస్తానంటూ హెచ్చరించారు.