Begin typing your search above and press return to search.

యాకూబ్ వీలునామా రాయలేదంట

By:  Tupaki Desk   |   30 July 2015 2:32 AM GMT
యాకూబ్ వీలునామా రాయలేదంట
X
ముంబయి బాంబు పేలుళ్ల ఘటనలో దోషి అయిన యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు చేయటం తెలిసిందే. అయితే.. తన ఆస్తులకు సంబంధించి అతడు ఎలాంటి వీలునామా రాయలేదని చెబుతున్నారు.

సుప్రీంకోర్టులో కానీ.. రాష్ట్రపతి వద్ద కానీ క్షమాభిక్ష లభిస్తుందన్న ఆశతో యాకూబ్ ఉన్నారని చెబుతున్నారు. ఈ కారణంతోనే వీలునామా రాయలేదన్న వాదన వినిపిస్తోంది. యాకూబ్ కు ఉరిశిక్ష అమలు చేసే ఆఖరి క్షణం వరకూ సినిమా టిక్ గా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ కారణం చేతనే వీలునామా అవసరం ఉందని భావించాడేమో. అయితే.. యాకూబ్ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇవ్వలేదు. మొత్తానికి వీలునామా రాయకుండానే యాకూబ్ చనిపోయాడు.