Begin typing your search above and press return to search.

వైసీపీ నేత ష‌ర్మిల కొడుకు కిడ్నాప్‌...విడుద‌ల‌!

By:  Tupaki Desk   |   19 Oct 2017 7:46 AM GMT
వైసీపీ నేత ష‌ర్మిల కొడుకు కిడ్నాప్‌...విడుద‌ల‌!
X
రాజ‌మండ్రి లో వైసీసీ నేత కుమారుడి కిడ్నాప్ క‌ల‌క‌లం రేపింది. రాజ‌మండ్రి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ లో వైసీపీ ఫ్లోర్ లీడ‌ర్ ష‌ర్మిలా రెడ్డి కొడుకు సిద్దార్థ్ రెడ్డి(10)ని గుర్తు తెలియ‌ని దుండ‌గులు అప‌హ‌రించారు. త‌న‌ను కిడ్నాప్ చేసిన కారు లోనుంచి బ‌య‌ట‌కు దూకి సిద్దార్థ్ త‌ప్పించుకున్నాడు. స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ష‌ర్మిల‌ - సిద్దార్థ్ లు త‌మ రెస్టారెంట్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మం నుంచి కారులో ఇంటికి వెళ్లారు. త‌న కుమార్తెను తీసుకురావ‌డానికి ష‌ర్మిల ఇంట్లోకి వెళ్లారు. ఆ స‌మ‌యంలో సిద్ధార్ధ్ ఒక్క‌డే కారులో ఉన్నాడు.తాళాలు కూడా కారుకే ఉండ‌డంతో గుర్తు తెలియని వ్య‌క్తి కారును స్టార్ట్ చేసి సిద్దార్థ్ ను అప‌హ‌రించాడు.

ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన షర్మిల వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై పోలీసుల‌కు - స్థానికుల‌కు స‌మాచార‌మందించారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు ఆ కారు కోసం గాలింపు చ‌ర్య‌ల‌ను ప్రారంభించారు. ప్ర‌కాశం న‌గ‌ర్ ద‌గ్గ‌ర కారు స్లో అయిన‌పుడు సిద్దార్థ్ కారు లో నుంచి బ‌య‌ట‌కు దూకాడు. చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి కిడ్నాప‌ర్ బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. కిడ్నాప‌ర్ కారును రాజ‌మండ్రికి 40 కిలోమీట‌ర్ల దూరంలో వ‌దిలిపెట్టి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.