Begin typing your search above and press return to search.
ప్రజల నమ్మకాన్ని నిలబెడతా..ఇది ప్రజల విజయమన్న జగన్!
By: Tupaki Desk | 23 May 2019 9:18 AM GMTచారిత్రక విజయాన్ని నమోదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విజయం మీద స్పందించారు. పార్టీ సాధించిన ఘన విజయానికి ప్రజలకు వినమ్రతతో కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో ఫ్యాన్ సృష్టిస్తోన్న ప్రభంజనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ తాజా విజయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అదొక్కటే కాదు.. ఏపీ ఎంపీ స్థానాల్ని క్లీన్ స్వీప్ చేయటం.. తెలుగుదేశం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించకపోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ హవా సాగుతున్న వేళ.. ఆయన తన స్పందనను తెలియజేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానీకానికి.. పెద్ద ఎత్తున ఓటుహక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటిచెప్పిన యావత్ ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానుస అని ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.
అదే సమయలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించటమే తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. చారిత్రక విజయం దిశగా దూసుకెళుతున్న వేళ.. జగన్ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ప్రజలు.. దేవుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోడీకి జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గురించి తాను ఇప్పుడేమీ మాట్లాడలేదన్నారు. ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న ఆయన.. ఇది పూర్తిగా ప్రజల విజయంగా పేర్కొన్నారు.
అదొక్కటే కాదు.. ఏపీ ఎంపీ స్థానాల్ని క్లీన్ స్వీప్ చేయటం.. తెలుగుదేశం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించకపోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ హవా సాగుతున్న వేళ.. ఆయన తన స్పందనను తెలియజేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానీకానికి.. పెద్ద ఎత్తున ఓటుహక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటిచెప్పిన యావత్ ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానుస అని ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.
అదే సమయలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించటమే తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. చారిత్రక విజయం దిశగా దూసుకెళుతున్న వేళ.. జగన్ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ప్రజలు.. దేవుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోడీకి జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గురించి తాను ఇప్పుడేమీ మాట్లాడలేదన్నారు. ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న ఆయన.. ఇది పూర్తిగా ప్రజల విజయంగా పేర్కొన్నారు.