Begin typing your search above and press return to search.

ప్రియుడు.. కొడుకుతో క‌లిసి భ‌ర్త‌ను చంపేసింది

By:  Tupaki Desk   |   17 Jun 2018 4:49 AM GMT
ప్రియుడు.. కొడుకుతో క‌లిసి భ‌ర్త‌ను చంపేసింది
X
బంధాలు అంత‌కంత‌కూ ప‌లుచ‌న అవుతున్నాయా? వెధ‌వ త‌ప్పుల్ని క‌ప్పి పుచ్చుకోవ‌టానికి ఎంత‌కైనా తెగించేందుకు వెనుకాడ‌ని దుర్మార్గం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. తాజాగా ఆ విష‌యాన్ని చెప్పే దారుణ ఘ‌ట‌న ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రియుడి మోజులో ప‌డిన ఒక మ‌హిళ త‌న భ‌ర్త‌ను క‌ర్క‌శంగా హ‌త‌మార్చిన వైనం కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కొచ్చింది.

ఈ త‌ర‌హా నేరాలు ఈ మ‌ధ్య‌న త‌ర‌చూ వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. తాజా ఉదంతంలో షాకింగ్ అంశం ఏమంటే.. ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను చంపిన ఎపిసోడ్‌లో క‌న్న‌కొడుకు సైతం పాలు పంచుకోవ‌టం. రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ అక్ర‌మ సంబందాల్ని నిలుపుకోవ‌టం కోసం ఉన్న బంధాల్ని హ‌త‌మార్చ‌టం క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసే అంశంగా చెప్పాలి. తాజాగా వెల్ల‌డైన ఈ షాకింగ్ క్రైంలోకి వెళితే..

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా క‌ల్వ‌కుర్తి ప‌ట్ట‌ణానికి చెందిన కావ‌లి మ‌ల్ల‌య్య‌కు పార్వ‌త‌మ్మ‌కు 22 ఏళ్ల క్రితం పెళ్లి జ‌రిగింది. వీరికి 16ఏళ్ల కొడుకు శ్రీ‌కాంత్ తో పాటు.. 13 ఏళ్ల కుమార్తె శ్రీ‌ల‌త ఉన్నారు. మ‌ల్ల‌య్య హైద‌రాబాద్‌లో కూలీ ప‌ని చేస్తూ ప్ర‌తి 15 రోజుల‌కోసారి ఇంటికి వ‌చ్చేవాడు. ఇదిలా ఉంటే.. నాగ‌ర్ క‌ర్నూలు మండ‌లం శ్రీ‌పురం గ్రామానికి చెందిన మేస్త్రీ రాము కుటుంబం.. క‌ల్వ‌కుర్తికి షిఫ్ట్ అయ్యింది. వీరు.. మ‌ల్ల‌య్య ఇంటి ప‌క్క‌నే అద్దెకు దిగారు.

రాము.. ఆయ‌న భార్య ప‌ని చేసే చోటే.. పార్వ‌త‌మ్మ కూడా ప‌ని చేసేది. ఈ ప‌రిచ‌యం అంత‌కంత‌కూ పెరిగి చివ‌ర‌కు వివాహేత‌ర సంబంధంగా మారింది. ఈ వ్య‌వ‌హారం గురించి తెలిసిన భ‌ర్త మ‌ల్ల‌య్య క‌ల్వ‌కుర్తికి వ‌చ్చేశాడు. అయినా రాముతో త‌న సంబంధాన్ని పార్వ‌త‌మ్మ కొన‌సాగిస్తుండ‌టంతో క‌ల‌త‌లు రేగాయి. రాముతో వివాహేత‌ర సంబంధాన్ని సాఫీగా కొన‌సాగించేందుకు భ‌ర్త‌ను మ‌ట్టుబెట్టాల‌న్న దుర్మార్గ‌పు ఆలోచ‌న చేసింది. దీనికి రాముతో పాటు పార్వ‌త‌మ్మ కుమారుడు శ్రీ‌కాంత్ కూడా మ‌ద్ద‌తు ప‌లికారు.

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్ర‌కారం భ‌ర్త మ‌ల్ల‌య్య‌ను ప్రియుడు.. కొడుకు స‌హ‌కారంతో పార్వ‌త‌మ్మ ముట్టుబెట్టింది. అనంత‌రం భ‌ర్త మృత‌దేహాన్ని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి.. గోనెసంచిలో వేసి దానికి క‌డ్డీ క‌ట్టి.. చెరువులో ప‌డేశారు. ఏమీ తెలియ‌న‌ట్లుగా ఇంటికి వ‌చ్చేసి ఎవ‌రి ప‌నుల్లో వారు మునిగిపోయారు.

రెండు నెల‌లు గ‌డుస్తున్నా కొడుకు ఇంటి రాలేదంటై మ‌ల్ల‌య్య త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ త‌ర్వాతి రోజు పార్వ‌త‌మ్మ సైతం భ‌ర్త క‌నిపించ‌ట్లేదంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ప్రాథ‌మికంగా విచారించిన పోలీసుల‌కు పార్వ‌తమ్మ మీద సందేహం వ‌చ్చింది. ఆ వెంట‌నే.. ఆమె ఫోన్ కాల్ డేటాను ప‌రిశీలించ‌గా.. త‌ర‌చూ రాముతో మాట్లాడుతున్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది.దీంతో.. వీరిద్ద‌రిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు ప్ర‌శ్నించ‌గా.. తాము చేసిన దారుణాన్ని బ‌య‌ట‌కు చెప్పేశారు. ప్రియుడి మోజులో ప‌డి క‌ట్టుకున్న భ‌ర్త‌ను చంపుకోవ‌టం ఒక ఎత్తు అయితే.. ఈ దుర్మార్గానికి కొడుకు కూడా స‌హ‌క‌రించ‌టం పోలీసులు సైతం షాక్ కు గురి అవుతున్నారు.