Begin typing your search above and press return to search.

దారుణం.. రేప్ చేసి గుడిలో త‌గ‌ల‌బెట్టేశారు

By:  Tupaki Desk   |   15 July 2018 4:51 PM GMT
దారుణం.. రేప్ చేసి గుడిలో త‌గ‌ల‌బెట్టేశారు
X
బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు - ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఇలాకాలో ఘోర చోటుచేసుకుంది. శాంతిభ‌ద్ర‌త‌ల‌పై ఓ వైపు ఆయ‌న ఉక్కుపాదం మోపుతున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్నా..మ‌రోవైపు అక్క‌డ మ‌హిళ‌ల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇటీవ‌ల ప‌లు ఘ‌ట‌న‌లు చోటుచేసుకోగా...తాజాగా మ‌రో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై సాముహిక అత్యాచారం చేసి దగ్గరల్లోనే ఓ ఆలయంలోకి ఈడ్చుకెళ్లి సజీవ దహనం చేశారు. సంభల్‌ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

షంబాల్ జిల్లాలోని ఓ గ్రామంలో మహిళ - తన భర్త ఇద్దరు పిల్లలితో నివసిస్తోంది. భర్త ఘాజియాబాద్‌ లో కూలీపనులు చేస్తుంటాడు. ఈ మహిళపై దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంట్లోకి పనులు చేసుకుంటున్న మహిళపై ఐదుగురు దుండగులు గ్యాంగ్‌ రేప్‌ చేశారు. నిందితులు ఐదుగురు తనపై అత్యాచారానికి పాల్పడిన సమయంలో బాధిత మహిళ పోలీసు హెల్ప్‌ లైన్ నెంబర్ 100కి ఫోన్ చేసినప్పటికీ ఆమె ఫోన్‌కాల్‌కు ఎలాంటి సమాధానం లేదని కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు. భర్త - కుటుంబ సభ్యులకు చెప్పేందుకు యత్నించగా వారి నెంబర్లు కలవక‌పోవ‌డంతో.. తన సోదరుడికి ఫోన్ చేసి జరిగిదంతా చెప్పింది. దీంతో సోద‌రుడు స్థానికుల‌ను - పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేసేలోగానే...అత్యాచారం చేసి వెళ్ళిపోయిన దుండగులు తిరిగొచ్చి ఆమెను దగ్గర్లోనే ఓ ఆలయంలోకి తీసికేళ్ళి యజ్ఞశాలలో ఆమెపై కిరోసిన్‌ పోసి తగలబెట్టారు. కాగా, నిందితులు ఐదుగురు కూడా అదే గ్రామానికి చెందిన అరమ్ సింగ్ - మహావీర్ - చరణ్ సింగ్ - గుల్లు - కుమార్‌ పాల్‌ గా పోలీసులు గుర్తించారు. గతకొన్ని నెలలుగా మహిళను వీరంతా వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క‌ల‌క‌లం రేపే ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.