Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ లో మ‌రో మారుతిరావు

By:  Tupaki Desk   |   26 Sep 2018 9:19 AM GMT
హైద‌రాబాద్‌ లో మ‌రో మారుతిరావు
X
హైద‌రాబాద్‌ లో మ‌రో మారుతీరావు తెర‌మీద‌కు రానున్నాడ‌ట‌. ప్రేమించిన పాపానికి అల్లుడిని చంపించి క‌ల‌క‌లం సృష్టించిన మారుతీరావు ఈ క్ర‌మంలో తండ్రి రాక్ష‌స‌త్వాన్ని రుచిచూపిస్తే..మ‌రో దుర్మార్గుడు ఎర్ర‌గ‌డ్డ‌లో త‌న బిడ్డ‌నే న‌రికి చంపే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే, ఇవి జ‌రిగిన సంఘ‌ట‌నలు. త్వ‌ర‌లో ఇలాంటి ప‌రువు హ‌త్య సంఘ‌ట‌న జ‌ర‌గ‌నుందట‌. గ‌త రెండు సంఘ‌ట‌న‌ల‌కు కులం కార‌ణం అయితే, జ‌ర‌గ‌బోయే సంఘ‌ట‌న‌కు మ‌తం కారణం కానుంద‌ని ఆ ప్రేమికుడు వాపోతున్నాడు. వివ‌రాల్లోకి వెళితే...హైద‌రాబాద్‌కు చెందిన ఆ ఇద్దరి మతాలు వేరైనా.. వారి మనుసులు కలిశాయి. తోడునీడగా ఉండాలని కలలు కన్నారు. కన్నవారిని ఎదిరించి.. కులం గోడలు దాటి ఒక్కటయ్యారు. మనసు ఇచ్చిన ప్రియుడి కోసం ఆ ప్రియురాలు పేరు కూడా మార్చుకుంది . అయితే ఇక్క‌డే అస‌లు చిక్కు వ‌చ్చి ఆ ప్రేమికుడి ఆవేద‌న మీడియాకు ఎక్కింది.

రాజు అనే యువకుడు - నాజ్నీన్‌ అనే యువతిని ప్రేమించాడు. ఆర్య‌సమాజ్‌ సాక్షిగా ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఆ జంట ఒక్కటైంది. మతాంతర వివాహం చేసుకున్న అనంత‌రం ముస్లిం అయిన నాజ్నీన్ త‌న పేరును సీత‌గా మార్చుకుంది. ఆ దంప‌తులు క‌లిసి ఉంటున్నారు. ప్ర‌స్తుతం ఆమె నాలుగు నెల‌ల గ‌ర్భిణి కూడా. అయితే హ‌ఠాత్తుగా ప‌ది రోజుల కింద‌ట నాజ్నీన్ అలియ‌స్ సీత ఆచూకీ లేదు. దీంతో రాజు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఈ నెల 17 నుంచి ఆ యువతి కన్పించకుండా పోయిందని.. ఆమెను తన కుటుంబసభ్యులు కిడ్నాప్‌ చేశారని రాజు ఆరోపిస్తున్నాడు. పరువు కోసం తన భార్యను చంపుతారని...పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని.. అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులతో ఉందని చెబుతున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అమ్మాయి మైనరే కాబట్టి ఆమె ఇష్టప్రకారం ఎక్కడ ఉంటానంటే వారితో పంపిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. ఆ అమ్మాయిని మీడియా ముందుకు తీసుకువ‌చ్చి త‌న ఇష్ట‌ప్ర‌కారం భ‌ర్త/ త‌ల్లిదండ్రుల ఉండాలో వెల్ల‌డిస్తారా లేక‌...రాజు భ‌య‌ప‌డుతున్న‌ట్లే..ఆమె ప‌రువు హ‌త్య‌కు గుర‌వుతుందా వేచి చూడాల్సిందే.