Begin typing your search above and press return to search.

ఈ కటింగ్‌ లేంటి రాజా

By:  Tupaki Desk   |   21 March 2019 12:45 PM GMT
ఈ కటింగ్‌ లేంటి రాజా
X
ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. వాటిని చూస్తూ మనం సరదాగా ఎంజాయ్‌ చెయ్యాలే తప్ప అసలు వాళ్లు ఎందుకు అలా చేశారు అని అడగకూడదు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయుకులు రకరకాల పనులు చేస్తుంటారు. లేబర్‌ దగ్గర ఉన్నప్పుడు లేబర్‌ గా కలరింగ్‌ ఇస్తుంటారు. ఇస్త్రీ చేయడం - హోటల్లో పని చేయడం లాంటివి అన్నమాట.

మామూలు లీడర్లుకు అయితే అవన్నీ కావాలి కానీ చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్‌ కు అవసరం లేదు. కానీ తనకు తాను మాస్‌ లీడర్‌ గా ఊహించుకునే లోకేష్‌.. అన్ని వర్గాల ప్రజల ఆదరణలో మంగళగిరిలో గెలుపొందాలని అనుకుంటున్నాడు. అందుకే సాధారణ రాజకీయ నాయకుడిగా బిహేవ్‌ చేస్తున్నారు. ఈ ఉదయం ఒక సెలూన్‌ లోకి వెళ్లి బార్బర్‌ లా మారిపోయారు. కటింగ్ చేసి.. ఫోటోలకు - వీడియోలకు ఫోజులిచ్చారు.

అయితే.. లోకేష్‌ ఇలా ఎగస్ట్రా కటింగులు ఇవ్వడం వెనుకు వేరే కారణం ఉందని వార్తలు విన్పిస్తున్నాయి. గతంలో నాయూ బ్రాహ్మణుల్ని చంద్రబాబు విమర్శించారు. దీంతో ఇప్పుడు వారిని ప్రసన్నం చేసుకునేందుకు లోకేష్‌ బార్బర్‌ అవతారం ఎత్తారు అని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. విమర్శనేవి ఎప్పుడూ ఉంటాయి కానీ లోకేష్‌ మాత్రం మంగళగిరిలో తనదైన స్టైల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు