Begin typing your search above and press return to search.

హైకోర్టు ప్ర‌శ్న: బిచ్చమెత్తితే తప్పేంటి?!!

By:  Tupaki Desk   |   17 May 2018 5:41 AM GMT
హైకోర్టు ప్ర‌శ్న: బిచ్చమెత్తితే తప్పేంటి?!!
X
రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అవాక్క‌య్యే ప‌రిణామం చోటుచేసుకుంది. చ‌ట్టాన్ని అమ‌లు చేయాలా..మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాలా అనే ద‌ర్మ‌సంక‌టంలో న్యాయ‌మూర్తులు ప‌డిపోయారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్ర‌జ‌ల సంక్షేమాన్ని ప‌రిర‌క్షించాల్సిన రాష్ట్ర ప్ర‌భుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇదంతా బిచ్చ‌మెత్తుకోవ‌డం గురించి. ఈ దీన‌మైన స్థితిని త‌మ హ‌క్కుగా ఇవ్వాల‌నే వారి ఆవేద‌న వింటున్న స‌మ‌యంలో ఘ‌ట‌న‌.

ఈ ప‌రిణామం చోటుచేసుకుంది ఢిల్లీ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో అడుక్కోవడానికి చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ - జస్టిస్ హరిశంకర్‌ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఓ వ్యక్తి బిచ్చమెత్తుకుంటాడని, అంతేగానీ అదేదో ఒక అవకాశంగా భావించి అడుక్కోడని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తిండిపెట్టదు.. పని ఇవ్వదు.. బిచ్చమెత్తితే తప్పేంటి? అది నేరం ఎలా అవుతుంది అని ఢిల్లీ హైకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. `మన దగ్గర డబ్బులు ఉంటే ఎందుకు అడుక్కుంటాం? కొందరు ఏమీ లేక.. చివరికి ఎటూతోచక కడుపు నింపుకోవడానికి ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సి వస్తుంది. ప్రభుత్వం తిండి పెట్టక- ఉపాధి కల్పించనప్పుడు అడుక్కుంటే నేరం ఎలా అవుతుంది? ``అని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో స్పందించిన కేంద్రంతరఫు న్యాయవాది బాంబే యాచక నిరోధక చట్టంలో అడుక్కోవడం నేరం అనే పలు నిబంధనలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే వీటికి మాన‌వ‌త దృక్ప‌థంలో, ఆచ‌ర‌ణాత్మ‌క ప‌రిష్కారాలు చూపాల‌ని కోర్టు ఆదేశించింది.