Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ బ‌ల‌ప‌డ్తున్నార‌నే టీడీపీ భ‌యం..!

By:  Tupaki Desk   |   20 April 2018 4:42 PM GMT
జ‌గ‌న్ బ‌ల‌ప‌డ్తున్నార‌నే టీడీపీ భ‌యం..!
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై సినీ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ చేసిన వివాదాస్పద‌ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ విరుచుకుప‌డింది. ప్ర‌ధాని అనే గౌర‌వం కూడా లేకుండా బాల‌య్య మాట్లాడ‌టం స‌రికాద‌ని మండిప‌డింది. బీజేపీ ఏపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే భయం టీడీపీకి పట్టుకుందని వ్యాఖ్యానించారు. అందుకే ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌లు వేస్తోంద‌ని వ్యాఖ్యానించారు. ‘బాలయ్య సినిమాల్లో స్టంట్లు - ఇంటికి వచ్చిన వాళ్లను కాలుస్తారని తెలుసు.. కానీ మిడిమిడి జ్ఞానంతో కూడా మాట్లాడతారని ఇప్పుడే తెలిసింది. బాలకృష్ణ వ్యాఖ్యలతో ఆయన తండ్రి ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోంది. ఇంట్లో ఇద్దరిని హత్య చేసి.. మాఫీ చేయించిన పెద్దమనిషి బాలకృష్ణ. కుటుంబ పాలన గురించి ఆంధ్రప్రదేశ్‌ లో అందరికీ తెలుసు. ఈ రోజు సాయంత్రం(ఏఫ్రిల్‌ 20) 7 గంటల్లోగా ప్రధానికి - హిజ్రాలకు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి ’ అని విష్ణుకుమార్‌ రాజు డిమాండ్ చేశారు. టీడీపీ కేవలం ఫ్యామిలీ పార్టీ మాత్రమే అని బీజేపీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

మ‌రోవైపు హైద‌రాబాద్‌ లో బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు చేసిన ధర్మదీక్ష కాదు అధర్మ దీక్ష అని ఆరోపించారు. సీఎం చంద్రబాబు దీక్ష ప్రధాని మోడీని తిట్టడానికి పెట్టారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రధానిని విమర్శించే ముందు ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడుతే బాగుంటుందని అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణను చూసి ప్రధాని పద్ధతి నేర్చుకోవాలా అని శ్రీ‌ధ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు. `నీ తండ్రిని రోడ్డుపై ఊరికిస్తే ఎక్కడ కూర్చున్నావ్ బాలకృష్ణ? ఎన్టీఆర్ కడుపులో పుట్టిన బాలకృష్ణ ఇలా మాట్లాడడం ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ప్రధాని పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణను చూసి తెలుగు ప్రజలు అవమానంగా భావిస్తున్నారు. మహిళ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ చెబితే మేము పద్ధతి నేర్చుకోవాలా?` అని అన్నారు. ప్రధాని మోడీ పై అనుచిత వ్యాఖ్యలు బాలకృష్ణ హైదరాబాద్ ఎలా పర్యటిస్తారో చూస్తామ‌ని బీజేపీ నేత ప్ర‌క‌టించారు. వెంటనే క్షేమపణలు చెప్పకపోతే ఎక్కడికక్కడ బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకుంటారు. టీడీపీ అధికారం అనుభవిస్తున్న దీక్ష నరేంద్రమోడీ పెట్టిన భిక్ష అని బీజేపీ నేత అన్నారు. `బీజేపీ కలిసి రాకపోతే... చంద్రబాబు శంకరగిరి మాన్యలు పెట్టేవాడు. బాలకృష్ణ తాగి మాట్లాడినట్లుగా ఉంది. వెంటనే క్షేమపణలు చెప్పకపోతే బాలకృష్ణ అడుగడుగునా అడ్డుకుంటాం. అడ్డగోలుగా మాట్లాడుతే నాలుక కోస్తాం` అని హెచ్చ‌రించారు.