Begin typing your search above and press return to search.

కుక్కలకు బిస్కెట్లలా.. కేరళ మంత్రి దారుణం..

By:  Tupaki Desk   |   20 Aug 2018 11:44 AM GMT
కుక్కలకు బిస్కెట్లలా.. కేరళ మంత్రి దారుణం..
X
కేరళ బాధితులకు ఇప్పుడు తిండి - నీరు దొరక్క సహాయక శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.. వరద బాధితుల కోసం ప్రభుత్వాలు - స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే కర్ణాటకలో కూడా ఈ వరదతో తీవ్ర నష్టం వాటిల్లింది. వీరిని ఆదుకునే విషయంలో సీఎం కుమారస్వామి సోదరుడు - మంత్రి రేవణ్ణ వ్యవహరించిన తీరు చూసి అందరూ ఛీ కొడుతున్నారు. అసలు మనిషిలా ప్రవర్తించలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

కేరళకు బార్డర్ లో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు - హాసన్ - మైసూర్ జిల్లాల్లో కూడా వరదలు పోటెత్తాయి. వరద బాధితులు సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వారికి మంచినీళ్లు - దుస్తులు - ఆహారం అందించేందుకు వెళ్లిన మంత్రి రేవణ్ణ రామనాథపురంలోని శిబిరంలో బిస్కెట్ ప్యాకెట్లను వరద బాధితుల చేతికి ఇవ్వకుండా వారి ఎదుట విసిరేవాడు. వీధి కుక్కలకు విసిరేసినట్లు విసరడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేవణ్ణ వరద బాధితుల పట్ల వ్యవహరించిన తీరును చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.