Begin typing your search above and press return to search.

రోశయ్య కోసం వెంక‌య్య ఆరాటం

By:  Tupaki Desk   |   26 Aug 2016 3:35 PM GMT
రోశయ్య కోసం వెంక‌య్య ఆరాటం
X
త‌మిళనాడు గవర్నర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగు నేలకు చెందిన సీనియర్ రాజకీయవేత్త కొణిజేటి రోశయ్య మరి కొంతకాలం కొనసాగనున్నారు. ఈ నెలాఖరులో గవర్నర్‌ గా ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వివాదరహితుడిగా ఉన్న రోశయ్యను తమ రాష్ట్రానికి గవర్నర్‌ గా మరింత కాలం పాటు కొనసాగించాలని తమిళనాడు సీఎం జయలలిత ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు. రోశయ్యతో పాటు అండమాన్ నికోబార్ - మణిపూర్ - అసోం - పంజాబ్ గవర్నర్ల పదవీ కాలం కూడా ముగియనుంది.

తమిళనాడు మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే కొత్త గవర్నర్లను నియమించింది. ఈ నేపథ్యంలో రోశయ్యను మరి కాంత కాలం తమిళనాడు గవర్నర్‌ గా కొనసాగించేందుకే కేంద్రం మొగ్గు చూపుతోందన్న వాదనకు బలం చేకూరింది. వివాదరహితుడిగా ఉన్న రోశయ్యను తమిళనాడుకు మరి కొంత కాలం కొనసాగిస్తే బాగుంటుందని బీజేపీ సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు - నితిన్ గడ్కరీ ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినట్లు సమాచారం. ఇటు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న‌ పార్టీ జాతీయ నాయ‌కుల ఒత్తిడి - అటు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌తిపాద‌న నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్‌ గా రోశ‌య్య‌ను కొన‌సాగించ‌నున్న‌ట్లు స‌మాచారం.