Begin typing your search above and press return to search.

విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు షాక్

By:  Tupaki Desk   |   16 Jun 2018 5:46 AM GMT
విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు షాక్
X
కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు షాక్ తగిలింది. భారత్ లోని ప్రభుత్వ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి ప్రస్తుతం బ్రిటన్ లో తలదాచుకుంటున్న మాల్యాకు బ్రిటన్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. తమ రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు చేస్తున్న చట్టబద్దమైన పోరాట వ్యయాల కింద 13 భారతీయ బ్యాంకులకు కనీసం 2 లక్షల పౌండ్లు (1.80 కోట్లు) చెల్లించాలని బ్రిటన్ కోర్టు ఆదేశించింది.

మరో వైపు మాల్యా ఆస్తులను జప్తు చేసేందుకు సంబంధించిన ఆర్డర్ ను కోర్టు తిరస్కరించింది. అయితే బ్యాంకులకు అవుతున్న ఖర్చును మాత్రం తప్పకుండా చెల్లించాల్సిందేనని ఆదేశించింది.

అయితే కోర్టు తీర్పు దృష్ట్యా మాల్యాను తిరిగి భారత్ రప్పించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు మాల్యాను పంపాల్సిందిగా కోరుతూ భారత్ వేసిన పిటీషన్ పై వచ్చే నెల వెస్ట్ మినిస్టర్ కోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. కాగా స్టేట్ బ్యాంక్ సహా దేశంలోని 13 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.9వేల కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా 2016లో దేశం విడిచి బ్రిటన్ పారిపోయిన సంగతి తెలిసిందే..