Begin typing your search above and press return to search.

అమెరికాలో ఇద్దరు ప్రవాసాంధ్రులు మృతి

By:  Tupaki Desk   |   24 Oct 2016 6:48 AM GMT
అమెరికాలో ఇద్దరు ప్రవాసాంధ్రులు మృతి
X
అమెరికాలోని లూయిస్ విల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు ప్రవాసాంధ్రులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో రామ వరాహభట్ల(35) - రాజశేఖర్ రెడ్డి యర్మాల(25) అనే ఇద్దరూ తీవ్రంగా గాయపడగా - వెంకట ప్రశాంత్ కొమ్ము(27) - అన్వేష్ కుమార్(24)లు మృతి చెందారు. లూయిస్ విల్లీలోని నార్త్ బెండ్ రోడ్డు మీద కారులో వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాధం చోటుచేసుకుంది!

ఒక అమెరికన్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఈ నలుగురూ కారులో వేగంగా వెళ్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా భారీ మలుపు వచ్చింది. ఆ విషయాన్ని కారును నడుపుతున్న రామ గుర్తించకపోవడంతో అదుపుతప్పిన కారు పక్కకు దూసుకెళ్లింది. ఆ సమయంలో గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టిన కారు.. అనంతరం ఒక చెట్టును ఢీ కొట్టి అందులో ఇరుక్కుపోయింది. దీంతో కారు ముందు భాగంలో కూర్చున్న రామ - రాజశేఖర్ లతో పాటు వెనుక భాగంలో కూర్చున్న అన్వేష్ కూడా తీవ్రంగా గాయపడి కారులో ఇరుక్కుపోయారు. అయితే, కారు వెనుక భాగంలోనే కూర్చున్న ప్రశాంత్ మాత్రం సడన్ గా కారు డోర్ ఓపెన్ చేయడంతో కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని ఆ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ప్రమాదం సంగతి తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న హబ్రాన్ ఫైర్ సర్వీసు అధికారులు కారులో చిక్కుకుపోయిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాజశేఖర్ ను యూనివర్సిటీ ఆఫ్ సిన్సిన్నాటి మెడికల్ సెంటర్ కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. రాజశేఖర్ స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని మథిర అని తెలిసింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అన్వేష్ - రామ లకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/