Begin typing your search above and press return to search.

మళ్లీ వారి ఈగో హర్ట్‌ చేసిన సచిన్‌

By:  Tupaki Desk   |   17 July 2019 11:03 AM GMT
మళ్లీ వారి ఈగో హర్ట్‌ చేసిన సచిన్‌
X
ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ కప్‌ టోర్నీ ముగిసింది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్‌ కొత్త విజేతగా అవతరించడం జరిగింది. న్యూజిలాండ్‌ అద్బుతమైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది. ప్రపంచ కప్‌ లో పాల్గొన్న జట్ల ఆటగాళ్ల నుండి తమ ఫేవరేట్‌ ఎలెవన్‌ జట్టు కొందరు ప్రకటిస్తూ ఉంటారు. ఇప్పటికే ఐసీసీ తమ ఎలెవన్‌ జట్టును ప్రకటించింది. అందులో ఎంఎస్‌ ధోనీ మరియు కోహ్లీ లేకపోవడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ సమయంలోనే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా తన ఫేవరెట్‌ ఎలెవన్‌ జట్టును ప్రకటించాడు.

టెండూల్కర్‌ జట్టులో ఇండియాకు చెందిన వారే అయిదుగురు ఉండటం విశేషం. సచిన్‌ ఎలెవన్‌ జట్టుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సచిన్‌ ఎంపిక సరిగా లేదని ప్రముఖులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా సచిన్‌ జట్టు ఎంపిక విషయంలో విమర్శలు చేస్తున్నారు. సచిన్‌ ఎలెవన్‌ జట్టులో రోహిత్‌ శర్మ.. కోహ్లీ.. పాండ్య.. బూమ్రా.. జడేజాలకు చోటు కల్పించాడు. పాండ్య.. జడేజా వంటి వారికి చోటు కల్పించి ధోనీని సెలక్ట్‌ చేసుకోక పోవడం పట్ల విమర్శళు వెళ్లువెత్తుతున్నాయి.

ప్రపంచ కప్‌ టోర్నీ సందర్బంలోనే ధోనీ కాస్త స్పీడ్‌ గా ఆడాలి అంటూ సచిన్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యలపై ధోని ఫ్యాన్స్‌ ఏ స్థాయిలో విరుచకు పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీకు ప్రపంచ కప్‌ ను ఇచ్చింది ధోని.. నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావా అంటూ గతంలో ఎప్పుడు లేని విధంగా సోషల్‌ మీడియాలో సచిన్‌ పై ట్రోల్స్‌ నమోదు అయ్యాయి. ఇప్పుడు తన ఫేవరెట్‌ ఎలెవన్‌ జట్టులో ధోనీకి స్థానం ఇవ్వక పోవడంతో మరోసారి సచిన్‌ పై ధోనీ ఫ్యాన్స్‌ విరుచుకు పడుతున్నారు.

ధోనీపై సచిన్‌ కు అసూయ అని.. ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు ఎప్పుడు తననే క్రికెట్‌ దేవుడిగా భావించాలని ధోనిని ఎక్కడ అంతా నెత్తికి ఎత్తుకుంటారో అని సచిన్‌ కు ఈర్శ్య అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి ధోనీ ఫ్యాన్స్‌ హర్ట్‌ అవ్వడంతో సచిన్‌ ను సోషల్‌ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నారు.