Begin typing your search above and press return to search.

తిరుప‌తి అధికారుల‌తో ఆర్బీఐకి ట్రైనింగ్‌

By:  Tupaki Desk   |   19 March 2018 4:35 AM GMT
తిరుప‌తి అధికారుల‌తో ఆర్బీఐకి ట్రైనింగ్‌
X
పెద్దనోట్ల రద్దుతో తిరిగి వచ్చిన డబ్బెంతో ఇప్పటికీ లెక్కించలేదంటున్న ఆర్బీఐ అధికారులపై కేంద్ర మాజీ మం త్రి పీ చిదంబరం వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆదివారం ఆయన మాట్లాడుతూ నేను ఆర్బీఐ అధికారులకు ఓ సలహా ఇవ్వదల్చుకున్నా. డబ్బును ఎలా లెక్కించాలో తిరుపతి హుండీ నిర్వాహకుల దగ్గరకు వెళ్లి నేర్చుకోండి. వారు మీ కంటే వేగంగా డబ్బును లెక్కిస్తారు అని అన్నారు. గత అక్టోబర్‌ లో ఓ ఆర్టీఐ దరఖాస్తుకు ఆర్బీఐ జవాబిస్తూ రద్దయిన నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నది. పెద్ద నోట్లను రద్దు చేసి ఇన్నిరోజులవుతున్నా ఇంకా లెక్కింపు పూర్తి చేయకపోవడంపై చిదంబరం ఆర్బీఐకి చురకలు అంటించారు.

ఇదిలాఉండ‌గా...పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పాత రూ.500 - 1,000 నోట్లను చీలికలుగా చేసి - ఇటుకల్లా మార్చుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఓ పీటీఐ ప్రతినిధి దాఖలు చేసిన పిటిషన్‌కు ఆర్బీఐ ఈ మేరకు వెల్లడించింది. ఈ నోట్ల పరిశీలన - ప్రామాణికత - లెక్కింపు తదితర సేవల కోసం దేశవ్యాప్తంగా వివిధ ఆర్బీఐ కార్యాలయాల్లో 59 కరెన్సీ వెరిఫికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (సీవీపీఎస్) మెషీన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నోట్లను రీసైక్లింగ్ చేయడం లేదని స్పష్టం చేసిన ఆర్బీఐ.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెషీన్ల ద్వారా చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి - ముద్దలు చేసి ఇటుకల్లా మార్చుతున్నట్లు వివరించింది. రద్దు సమయంలో ఉన్న కరెన్సీలో 99 శాతం ఈ పెద్ద నోట్లే ఉండగా - వీటి విలువ రూ.15.44 లక్షల కోట్లుగా ఉందని - నిరుడు జూన్ 30 నాటికి డిపాజిట్ల రూపంలో రూ.15.28 లక్షల కోట్లు వచ్చాయంది.