Begin typing your search above and press return to search.
టిక్ టాక్ సెలబ్రిటీ దారుణహత్య..!
By: Tupaki Desk | 22 May 2019 10:48 AM GMTస్వల్ప వ్యవధిలో విస్తృతంగా వ్యాప్తి చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్. ఇందులో ఎవరికి వారు తమ వీడియోల్ని పోస్ట్ చేసుకునే వీలుంది. చిన్న చిన్న వీడియోలతో ఫన్నీగా.. ఎటకారంగా.. ఎలా కావాలంటే అలా వీడియోల్ని అప్ లోడ్ చేసే టిక్ టాక్ పుణ్యామా అని ఎందరో సెలబ్రిటీలు అయ్యారు.అలాంటి వారిలో 24 ఏళ్ల మోహిత్ మోర్ ఒకరు. అతగాడు టిక్ టాక్ లో ఎంత ప్రముఖుడు అంటే.. అతనికి దాదాపు 50 లక్షలకు పైనే ఫాలోవర్లు ఉన్నారు.
ఢిల్లీలో నివాసం ఉండే అతగాడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఢిల్లీలోని నజఫ్ గఢ్ ప్రాంతంలో ఒక ఫోటో స్టూడియోకు వెళ్లిన వేళలో ఈ దారుణం చోటు చేసుకుంది. షాపు ముందున్న సోఫాలో కూర్చొని ఉండగా.. ముగ్గురుగుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి మోహిత్ మీద కాల్పులు జరిపి పారిపోయారు.
అతని హత్య ఉదంతం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. హత్యకు పాల్పడిన ఇద్దరు దుండగుల్లో ఒకరు ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు హెల్మెట్ తగిలించుకోగా.. మరో వ్యక్తి ముఖం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కాల్పులకు గురైన మోహిత్ మోర్ శరీరంలో 13 బుల్లెట్లు దిగినట్లుగా చెబుతున్నారు.
హత్యకు కారణం ఏమిటన్నది ఇప్పటివరకూ బయటకు రాలేదు. ఏదైనా గ్యాంగ్ లతో గొడవలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇతగాడి దారుణ హత్య జరగటానికి కాస్త ముందు స్థానిక ద్వారకా మోర్ మెట్రో స్టేషన్ వద్ద ఇద్దరు క్రిమినల్స్ హత్యకు గురి కావటం గమనార్హం. ఈ హత్యలకు.. మోహిత్ హత్యకు ఏమైనా లింకులు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఢిల్లీలో నివాసం ఉండే అతగాడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఢిల్లీలోని నజఫ్ గఢ్ ప్రాంతంలో ఒక ఫోటో స్టూడియోకు వెళ్లిన వేళలో ఈ దారుణం చోటు చేసుకుంది. షాపు ముందున్న సోఫాలో కూర్చొని ఉండగా.. ముగ్గురుగుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి మోహిత్ మీద కాల్పులు జరిపి పారిపోయారు.
అతని హత్య ఉదంతం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. హత్యకు పాల్పడిన ఇద్దరు దుండగుల్లో ఒకరు ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు హెల్మెట్ తగిలించుకోగా.. మరో వ్యక్తి ముఖం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కాల్పులకు గురైన మోహిత్ మోర్ శరీరంలో 13 బుల్లెట్లు దిగినట్లుగా చెబుతున్నారు.
హత్యకు కారణం ఏమిటన్నది ఇప్పటివరకూ బయటకు రాలేదు. ఏదైనా గ్యాంగ్ లతో గొడవలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇతగాడి దారుణ హత్య జరగటానికి కాస్త ముందు స్థానిక ద్వారకా మోర్ మెట్రో స్టేషన్ వద్ద ఇద్దరు క్రిమినల్స్ హత్యకు గురి కావటం గమనార్హం. ఈ హత్యలకు.. మోహిత్ హత్యకు ఏమైనా లింకులు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.