Begin typing your search above and press return to search.

బ్యాంకాక్ లో ఏపీ యువకుడి మ‌ృతి

By:  Tupaki Desk   |   14 Aug 2018 10:10 AM GMT
బ్యాంకాక్ లో ఏపీ యువకుడి మ‌ృతి
X
విహార యాత్ర కాస్త విషాధ యాత్రగా మిగిలిపోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. స్విమ్మింగ్ ఫూల్ ఏపీ యువకుడిని మింగేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు బ్యాంకాక్ లో మృతిచెందాడు. ప్రమాదవశాత్తూ స్మిమ్మింగ్ ఫూల్ లో పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ఈత రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాద్ హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్న వెంకటేశ్ బ్యాంకు పని నిమిత్తం ఇటీవలే బ్యాంకాక్ కు వెళ్లాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు బ్యాంకాక్ పోలీసులు సమాచారం అందించారు. కొడుకు మరణ వార్త విన్న వింటనే తల్లిదండ్రులు భోరుమన్నారు. మృతదేహాన్ని భారత్ కు రప్పించడానికి అధికారు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకాక్ లో వెంకటేశ్ మరణంతో స్వగృహంలో విషాధచాయలు అలుమకున్నాయి.