Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగు యువ‌తి మృతి!

By:  Tupaki Desk   |   30 Sep 2016 9:31 AM GMT
అమెరికాలో తెలుగు యువ‌తి మృతి!
X
ఉన్న‌త విద్య కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి ప్రియాంక గోగినేని ఒక ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయింది. సెయింట్ మాట్రిన్ యూనివ‌ర్శిటీ (సియాటెల్‌)లో ప్రియాంక చ‌దువుతోంది. ద‌గ్గ‌ర్లో హిక్స్ లేక్ కు ఈత కోసం వెళ్లింది. అయితే, అక్క‌డ అనూహ్యంగా చోటుచేసుకున్న ప్ర‌మాదంలో ప్రియాంక ప్రాణాలు కోల్పోయింద‌ని చెబుతున్నారు. ప్రియాంక మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న ఆమె స్నేహితులు ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌)కు ఫోన్ చేసి విష‌యం తెలియ‌జేశారు. దీంతో నాట్స్ రంగంలోకి దిగి ప్రియాంక మృత‌దేహాన్ని ఇండియా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకోవైపు, ఆమె మ‌ర‌ణ వార్త‌ను కావ‌లిలో ఉంటున్న ఆమె తల్లిదండ్రుల‌కు తెలిపారు. ఉన్న‌త చ‌దువుల కోసం వెళ్లిన త‌మ పెద్ద కుమార్తె ఇలా మృత‌దేహమై అమెరికా నుంచి తిరిగి వ‌స్తోంద‌ని తెలిసి ఆ అమ్మానాన్న‌లు కుప్ప‌కూలిపోయారు.

నెల్లూరు జిల్లాలోకి కావ‌లికి చెందిన వెంక‌టేశ్వ‌ర్లు - స‌త్య‌వ‌తి దంప‌తుల పెద్ద కుమార్తె ప్రియాంక‌. ఈమెకి ఒక సోద‌రుడు కూడా ఉన్నాడు. కావ‌లిలో కాంట్రాక్ట‌ర్ గా ప‌నిచేస్తుంటారు వెంక‌టేశ్వ‌ర్లు. ఉన్న‌త విద్య కోసం ఆమెను అమెరికా పంపించారు. ఈత కోసం వెళ్లిన కుమార్తె మ‌ర‌ణించింద‌ని తెలియ‌గానే ప్రియాంక కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఆమె భ‌విష్య‌త్తు గురించి ఎన్నో క‌ల‌లు క‌న్న త‌ల్లిదండ్రులు ఇప్పుడు గుండెల‌విసేలా రోదిస్తున్నారు. ప్రియాంక మృత‌దేహాన్ని స్వ‌స్థ‌లాన్ని పంపించేందుకు నాట్స్ ప్ర‌య‌త్నిస్తోంది. స్థానిక పోలీసు ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/