Begin typing your search above and press return to search.

అమెరికా రోడ్డు ప్ర‌మాదంలో తెలుగు విద్యార్థి మృతి

By:  Tupaki Desk   |   15 May 2017 5:27 AM GMT
అమెరికా రోడ్డు ప్ర‌మాదంలో తెలుగు విద్యార్థి మృతి
X
అమెరికాలో చోటు చేసుకున్న ఓ ఘోర రోడ్డు ప్ర‌మాదంలో తెలుగు కుర్రాడు మ‌ర‌ణించాడు. ఇల్లినాయిస్ లింక‌న్ హైవే మీద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో చిత్తూరు జిల్లా న‌గ‌రికి చెందిన అడ్లూరి సాయి కుమార్ మ‌ర‌ణించిన‌ట్లుగా పోలీసులు ధ్రువీక‌రించారు. ఇల్లినాయిస్ విశ్వ‌విద్యాల‌యంలో సాయికుమార్ చ‌దువుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఈ రోడ్డు యాక్సిడెంట్లో సాయికుమార్ తో పాటు మ‌రో యువ‌తి కూడా గాయాల‌పాల‌య్యారు. ఘ‌ట‌నాస్థ‌లంలోనే సాయి కుమార్ మ‌ర‌ణించ‌గా.. తీవ్ర గాయాల‌కు గురైన యువ‌తిని హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇదిలా ఉండ‌గా.. సాయికుమార్ మృత‌దేహాన్ని ఇండియాకు త‌ర‌లించేందుకు అక్క‌డి ప్ర‌వాసాంధ్రులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న కొడుకు.. యాక్సిడెంట్లో విగ‌త‌జీవిగా మారిన వార్త‌తో అత‌డి త‌ల్లిదండ్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.