Begin typing your search above and press return to search.

హ‌నీమూన్‌లో మోడీ, సీఎం...ఆవేద‌న‌లో వాళ్లు

By:  Tupaki Desk   |   20 July 2018 1:37 PM GMT
హ‌నీమూన్‌లో మోడీ, సీఎం...ఆవేద‌న‌లో వాళ్లు
X
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా హాట్ హాట్ చ‌ర్చ జ‌రిగింది. అనేక ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ ఎంపీ, మాజీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ వినోద్‌కుమార్ విభ‌జ‌న చ‌ట్టంపై కామెంట్లు చేశారు. తెలంగాణకు మోడీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ప్రధాని మోడీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు ఈ నాలుగేళ్లలో నెరవేర్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా అంటే ఏమిటి? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటో రాహుల్ గాంధీ వివరించాలని డిమాండ్ చేశారు. హోదా ఇచ్చినప్పుడు పన్ను మినహాయింపులు ఇస్తారా? లేదా? అని రాహుల్‌ను ప్రశ్నించారు. తమకు కూడా పన్ను మినహాయింపులు ఇస్తారా? అని అడిగారు. ఎందుకంటే తమకు మోసపోవాలని లేదన్నారు. అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటో నిర్వచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దానికంటూ ఓ చట్టం కూడా లేదని వినోద్ తెలిపారు.

ప్రత్యేక హోదా అంటే ఏమిటో స్పష్టత ఇవ్వాలని వినోద్ కోరారు. ప్రత్యేక హోదాకు నిధులు ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని వినోద్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటో కాంగ్రెస్, బీజేపీ నిర్వచనాన్ని చెప్పాలన్నారు. తమ డిమాండ్లకు ప్రధాని మోడీ, రాహుల్ సమాధానం ఇవ్వాలని వినోద్ డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చిందని ఎంపీ వినోద్ విమర్శించారు. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోనని మోడీని చంద్రబాబు బెదిరించారని గుర్తుచేశారు. ప్రధాని మోడీ స్వయంగా చొరవ తీసుకుని.. ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపారని చెప్పారు. ఏపీలో విలీనం చేసిన 7 మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చిందని ఎంపీ వినోద్ విమర్శించారు. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోనని మోడీని చంద్రబాబు బెదిరించారని గుర్తుచేశారు. ప్రధాని మోడీ స్వయంగా చొరవ తీసుకుని.. ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపారని చెప్పారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హనీమూన్‌లో ఉన్న సమయంలో తెలంగాణను అన్యాయం చేశారు. ఏపీలో విలీనం చేసిన 7 మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని, ఇందుకోసం లోక్ సభలో పునర్విభజన చట్టంలో సవరణ బిల్లు పెట్టాలి` అని ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు.

ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించి నిధులు ఇస్తోందని, తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ప్రకటించాలని వినోద్ డిమాండ్ చేశారు. పోలవరంలో నీటి పంపకం గురించే తాము అడుగుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందే నీటి పంపకాల్లో వివక్షకు వ్యతిరేకంగానని ఆయన గుర్తుచేశారు. విభజన చట్టంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, దీనిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా ప్రధాని పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్ట్ విభజన వెంటనే చేయాలని కోరారు. ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ రికార్డ్ సమయంలో కట్టుకుంటారు కానీ.. హైకోర్ట్ ఏర్పాటుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. హైదరాబాద్ లోని ఉమ్మడి హైకోర్టులో తమ ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులు పెద్దగా లేరని చెప్పారు.