Begin typing your search above and press return to search.

4 ల‌క్ష‌లు ట‌చ్ అయ్యే వేళ.. కాంగ్రెస్‌ కు ల‌చ్చే!

By:  Tupaki Desk   |   24 Nov 2015 6:56 AM GMT
4 ల‌క్ష‌లు ట‌చ్ అయ్యే వేళ.. కాంగ్రెస్‌ కు ల‌చ్చే!
X
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితం స‌రికొత్త రికార్డు సృష్టించే దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. టీఆర్ ఎస్ నేత‌లు సైతం ఊహించ‌ని రీతిలో భారీ మెజార్టీని వ‌రంగ‌ల్ ఓట‌ర్లు తెలంగాణ అధికార‌ప‌క్షానికి క‌ట్ట‌బెడుతున్నారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి క‌డియం శ్రీహ‌రికి వ‌చ్చిన మెజార్టీ కంటే మిన్నగా ఉండే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

తెలంగాణ‌కు పోలైన ఓట్లు.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు పోలైన ఓట్ల‌కు మ‌ధ్య అంత‌రం అంత‌కంత‌కు పెరుగుతుంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యానికి టీఆర్ ఎస్ కు మొత్తం 4.05ల‌క్ష‌ల ఓట్లు పోల్ కాగా.. కాంగ్రెస్‌కు 1.17ల‌క్ష‌ల ఓట్లు వ‌చ్చాయి. ఇక‌.. బీజేపీకి అయితే ల‌చ్చ‌కు ఇంకా ద‌గ్గ‌ర‌కు రాని ప‌రిస్థితి. బీజేపీ ల‌క్ష ఓట్ల‌కు చేర‌టానికి ఇంకా 18వేల ఓట్ల దూరంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఓట్ల లెక్కింపు అనంత‌రం వెలువ‌డుతున్న ఫ‌లితాల తీరు చూస్తుంటే.. వ‌రంగ‌ల్ ప్ర‌జ‌లు టీఆర్ ఎస్ కు పూర్తి స్థాయిలో మ‌ద్దుతు ప‌లుకుతున్న‌ట్లు క‌నిపించ‌క మాన‌దు. అదేస‌మ‌యంలో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న విప‌క్షాలు.. ప్ర‌జ‌లిచ్చిన తీర్పుతో నోట మాట రాని ప‌రిస్థితి.