Begin typing your search above and press return to search.
పవన్ కు కేసీఆర్ ఇలా షాకిస్తున్నారా?
By: Tupaki Desk | 17 Dec 2018 9:45 AM GMTజనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని షాక్ ఇవ్వనున్నారా? ఏపీ లో జరగబోయే ఎన్నికల్లో తాను సీఎం అవుతానంటూ పవన్ వ్యక్తీకరిస్తున్న ధైర్యం దెబ్బతీసేలా... కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నార? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని పేర్కొన్న పవన్ తాము బరి లో దిగడం లేదని, సమర్థులైన నేతని ఎన్నుకోవాలన్నారు. అయితే, అంతర్గతంగా జనసేన పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని పార్టీ వర్గాలకు, సానుభూతిపరులకు సూచించినట్లు, వారు తగు విధంగా నడుచుకున్నట్లు ప్రచారం జరిగింది.
ఇదిలా ఉండగా, ఇటీవలే ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అందరిచూపు ఏపీలో కేసీఆర్ పోషించే పాత్రపై పడింది. సహజంగానే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న వారెవరికి కేసీఆర్ మద్దతు ఇవ్వబోతున్నారనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలను ప్రశ్నిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లలో ఎవరికి గులాబీ దళపతి మద్దతు ఇవ్వనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న తరుణంలో... కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు మద్దతివ్వాలని తెలంగాణ సీఎం నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఏపీ రాజకీయాల్లో పవన్ కంటే వైఎస్ జగన్ బలంగా ఉన్నారని భావిస్తూ... దీంతో పాటుగా తెలంగాణ లో కీలకమైన రెడ్డి సామాజికవర్గాన్ని సంతృప్తి పరిచేందుకు వైసీపీకి మద్దతుగా వ్యవహరించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ టీఆర్ఎస్ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ప్రచారం నిజమైతే.... జనసేన పార్టీకి భారీ షాక్ తిన్నట్లేనని అంటున్నారు. ఏపీలో కీలక సమయం లో వైసీపీకి మద్దతుగా కేసీఆర్ వ్యవహరించడం జనసేన లక్ష్యాలను దెబ్బతీయడం ఖాయమని వారు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవలే ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అందరిచూపు ఏపీలో కేసీఆర్ పోషించే పాత్రపై పడింది. సహజంగానే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న వారెవరికి కేసీఆర్ మద్దతు ఇవ్వబోతున్నారనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలను ప్రశ్నిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లలో ఎవరికి గులాబీ దళపతి మద్దతు ఇవ్వనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న తరుణంలో... కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు మద్దతివ్వాలని తెలంగాణ సీఎం నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఏపీ రాజకీయాల్లో పవన్ కంటే వైఎస్ జగన్ బలంగా ఉన్నారని భావిస్తూ... దీంతో పాటుగా తెలంగాణ లో కీలకమైన రెడ్డి సామాజికవర్గాన్ని సంతృప్తి పరిచేందుకు వైసీపీకి మద్దతుగా వ్యవహరించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ టీఆర్ఎస్ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ప్రచారం నిజమైతే.... జనసేన పార్టీకి భారీ షాక్ తిన్నట్లేనని అంటున్నారు. ఏపీలో కీలక సమయం లో వైసీపీకి మద్దతుగా కేసీఆర్ వ్యవహరించడం జనసేన లక్ష్యాలను దెబ్బతీయడం ఖాయమని వారు పేర్కొంటున్నారు.