Begin typing your search above and press return to search.

ఆ టీడీపీ సీనియ‌ర్ పార్టీ మారితే రాజ్య‌స‌భ!

By:  Tupaki Desk   |   24 Nov 2017 5:18 PM GMT
ఆ టీడీపీ సీనియ‌ర్ పార్టీ మారితే రాజ్య‌స‌భ!
X
తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రోమారు జంప్ జిలానీల వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తెలంగాణ టీడీపీకి గుడ్ బై చెప్పి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంలో `ముఖ్య‌` ల‌క్ష్యాన్ని సాధించేందుకు కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ రెడ్డి ఎపిసోడ్ అనంత‌రం ఇది మ‌రింత వేడెక్కింది. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కార‌ణంగా ఆ పార్టీకి ద‌క్కుతున్న బ‌లాన్ని త‌క్కువ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమై ప‌లువురు నేత‌ల‌కు కండువా క‌ప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌ను మ‌రింత కొన‌సాగించేందుకు మ‌రికొంద‌రు టీడీపీ నేత‌ల‌కు తెలంగాణ ద‌ళ‌ప‌తి కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.


ఇటీవల శాసనసభకు వచ్చి సీఎం కేసీఆర్‌ను తెలంగాణ టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ మార్పున‌కు సంకేతాలిచ్చారు. దీనిపై పెద్ద చర్చ జరగ్గా సీఎం కేసీఆర్ నేరుగా ఆమెతో మాట్లాడి రాజకీయ భవిష్యత్ కు హామీనిచ్చినట్లు తెలిసింది. ఇప్ప‌టికే తన అనుచరులతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరపగా, ఎక్కువమంది టీఆర్ఎస్‌లోకి వెళ్ళేందుకు మొగ్గుచూపినట్లు సమాచారం. వ‌చ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఉమామాధ‌వ‌రెడ్డి స‌న్నిహితవర్గాలు చెబుతున్నాయి. న‌ల్ల‌గొండ‌లో బ‌లోపేతం అయ్యేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న సీఎం కేసీఆర్ ఈ హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో ఉమా మాధ‌వ‌రెడ్డి తెలంగాణ రాష్ట సమితిలో చేరడం దాదాపు ఖాయమైందని అంటున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాధవ రెడ్డి ప్రత్యేకముద్ర వేయగా, ఆయన తదనంతరం ఉమా మాధవరెడ్డి చంద్రబాబు క్యాబినెట్లో రాష్టమంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి, నల్లగొండ జిల్లాపై పట్టుకొనసాగించారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలుగుదేశం పార్టీ కుదేల‌యిపోవ‌డం...మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన కుమారుని రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారకతప్పదని గ్రహించిన ఆమె సీఎం కేసీఆర్‌ను క‌లిసిన‌ట్లు స‌మ‌మాచారం. తనకుమారుని భవిష్యత్‌పై కూడా ఆమె హామీ కోరగా, అది తనకు వదిలేయమని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది.