Begin typing your search above and press return to search.

మహిళ అని చూడకుండా టీడీపీ నేతల దాడి

By:  Tupaki Desk   |   23 Feb 2019 9:19 AM GMT
మహిళ అని చూడకుండా టీడీపీ నేతల దాడి
X
బద్వేలు పట్టణంలో దారుణం జరిగింది. పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో నివసిస్తున్న భార్యభర్తలపై శుక్రవారం ఓ స్థల వివాదంలో అధికారపార్టీకి చెందిన నేతతోపాటు మరికొందరు దాడి చేసి గాయపరచడం కలకలం రేపింది. బాధితుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తెలుగుగంగ కాలనీలో తుమ్మలూరు సరస్వతి - వీరభాస్కర్ రెడ్డిలు నివసిస్తుంటారు. వారి ఇంటిపక్కనే ఉన్న స్థలంలో ట్రాక్టర్ తో రాళ్లు తరలిస్తుండగా సరస్వతీ అడ్డుకుంది. ఈ స్థలం పై కోర్టులో కేసు నడుస్తోందని.. రాళ్లు తొలగించవద్దంటూ ప్రశ్నించి వారిని పంపించింది.

ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన గోడిరమణారెడ్డి తన అనుచరుడైన బత్తుల వెంకటేశ్వర్లు - మరికొందరితో కలిసి సరస్వతీ - భాస్కర్ రెడ్డిని దూషిస్తూ వారిపై దాడిచేశారు. దాడిలో గాయపడిన దంపతులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని గొడవకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యాలను చూపించి రాతపూర్వకంగా వారిపై ఫిర్యాదు చేశారు. దీనిపై రమణారెడ్డి సహా కొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.