Begin typing your search above and press return to search.

ప‌రువు హ‌త్య‌...పంట‌పొలంలోనే లేపేశారు

By:  Tupaki Desk   |   27 May 2017 4:38 PM GMT
ప‌రువు హ‌త్య‌...పంట‌పొలంలోనే లేపేశారు
X
ప్రేమ‌ - ప‌రువు హ‌త్య‌ల్లో మ‌రో దారుణ‌మైన ఉదంతం చోటుచేసుకుంది. తమ కులం కాని వాడు తన కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడన్న కోపంతో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నరేష్ అనే యువకుడిని అత్యంత దారుణంగా చంపి మృత‌దేహాన్ని దహానం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యాదాద్రి జిల్లా ఆత్మకూర్ ఎం మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన నరేష్ పక్క ఊరికి చెందిన స్వాతీలు ఏప్రిల్ నెలలో ప్రేమించి పెళ్ళి చేసుకున్నరు. ముంబయ్ లో నరేష్ తన అక్క ఇంటి వద్ద స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. తమకు స్వాతి తల్లి దండ్రుల నుంచి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించమని అక్కడి పోలీస్ స్టేష‌న్‌ ను ఆశ్రయించారు. ముంబయ్ పోలీసులు రక్షణ కల్పించి స్వాతిని న‌రేష్‌ ను వారి స్వగ్రామానికి పంపించారు.

అయితే స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి తన కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో రగిలిపోయాడు. స్వాతికి న‌చ్చ‌జెప్పి భర్త నరేష్ నుంచి వేరు చేసి తమ ఇంటికి తీసుకుపోయాడు. ఆ మరుసటి రోజు నుంచి నరేష్ కన్పించకుండా పోయాడు. నరేష్ తల్లి తండ్రులు తమ‌ కొడుకు ఆచూకి తెలపాలంటూ ముంబయ్ బాంద్రా కోర్ట్ ను ఆశ్రయించారు. నరేష్ జాడ కనిపెట్టాలని కోర్ట్ పోలీసుల్ని ఆదేశించింది. అప్పటి నుంచి పోలీసులు నరేష్ కోసం గాలిస్తున్నారు.

న‌రేష్ లేడన్న విషయం తెలుసుకున్న స్వాతి ఈ నెల 15 న తన ఇంట్లో బాత్ రూంలో చున్నితో ఊరేసుకోని ఆత్మహత్య చేసుకుంది. స్వాతి ఆత్మ‌హ‌త్య‌తో పోలీసులు స్వాతి తండ్రిని విచారించారు. నరేష్ ను తానే చంపానంటూ తన పొలంలోనే శవాన్ని దహానం చేసినట్లు స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి విచారణలో ఒప్పుకున్నాడు. తన కూతురు కులాంతర వివాహం చేసుకున్నందుకు శ్రీనివాస్ రెడ్డి పరువు హత్య కు పాల్పడిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేల్చారు. కాగా, ఈ హ‌త్య‌కు శ్రీనివాస్ రెడ్డి బాబాయ్, బాబాయ్ కొడుకు స‌హ‌క‌రించిన‌ట్లు తేలింది. చివరికి స్వాతీ, నరేష్ ల ప్రేమ విషాదాంతంగా ముగియడంతో రెండు గ్రామాల్లో విషాదంలో మునిగిపోయాయి. నరేష్ తల్లి దండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నా. శ్రీనివాస్ రెడ్డితో పాటు అత‌నికి సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/