Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ ఫ్యాన్స్ ను లైట్ తీసుకున్నాడు

By:  Tupaki Desk   |   27 Jun 2017 6:22 AM GMT
ర‌జ‌నీ ఫ్యాన్స్ ను లైట్ తీసుకున్నాడు
X
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌తి విష‌యానికి త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యే ఆయ‌న‌.. మిగిలిన క‌మ‌ల‌నాథుల‌కు భిన్నంగా ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి మాట్లాడ‌టం తెలిసిందే. ర‌జ‌నీని రాజకీయాల్లోకి రావాలంటూ బీజేపీ నేత‌లు కోరుతుంటే.. స్వామి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. చివ‌ర‌కు ర‌జ‌నీకాంత్ ఆర్థిక నేర‌స్తుడిగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మంట పుట్టించాయి. ఈ వ్యాఖ్య‌పై ర‌జ‌నీ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. ఎవ‌రిపై నిర‌స‌న‌లు చేయొద్దని త‌మ ఆరాధ్య‌దైవం చెప్పిన మాట‌ల ప్ర‌కారం న‌డుచుకుంటున్నామ‌ని.. లేకుంటే స్వామిని వ‌దిలిపెట్టేవాళ్లం కాద‌ని వారు ఫైర్ అవుతున్నారు.

ర‌జ‌నీ ఫ్యాన్స్ ఇంత‌గా మండిప‌డుతున్నా.. స్వామి మాత్రం అస్స‌లు వెన‌క్కి త‌గ్గ‌టం లేదు. తాజాగా ఆయ‌న మ‌రిన్ని మంట‌పుట్టించే వ్యాఖ్య‌లు చేసిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాను ఇంత‌కుమునుపు ఆరోపించిన‌ట్లుగా ర‌జ‌నీ ఆర్థిక నేర‌స్తుడేన‌ని.. అందుకు సంబంధించిన ఆధారాలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని ఆయ‌న తాజా బాంబు పేల్చారు.అంతేనా.. ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని తేల్చేశారు. ఇక‌పై ర‌జ‌నీకాంత్‌ ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ల‌వ‌రంటూ ఆయ‌న వెల్ల‌డించారు. ఇదిలాఉంటే స్వామి వ్యాఖ్య‌ల‌పై ర‌జ‌నీ అభిమానులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. స్వామిని కంట్రోల్ చేయాల‌ని వారు బీజేపీ నేత‌ల్ని కోరుతున్నారు. లేనిప‌క్షంలో తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఎవ‌రికి లేని రీతిలో ర‌జ‌నీపై ఇంత‌గా విరుచుకుప‌డుతున్న స్వామి రానున్న రోజుల్లో మ‌రెంత దూకుడుగా రియాక్ట్ అవుతారోన‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/