Begin typing your search above and press return to search.

ఎందుకిలా?: ఏపీలో మరో విద్యార్థిని సూసైడ్

By:  Tupaki Desk   |   13 Oct 2015 8:02 AM GMT
ఎందుకిలా?: ఏపీలో మరో విద్యార్థిని సూసైడ్
X
ఏపీలో ఇప్పుడు చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలోని పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం సంచలనం సృష్టిస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరన్నట్లు తరచూ ఆత్మహత్యలకు పాల్పడటం ఏపీ సర్కారుకు ఇబ్బంది కలిగించే అంశమే. తాజాగా ఇలాంటి ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది.

ఇంటర్ చదువుతున్న నందిని అనే విద్యార్థిని ఒక ప్రముఖ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. మంగళవారం తాను ఉండే హాస్టల్ లోని చెట్టుకు ఉరేసుకొని మరణించటం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఈమె ఆత్మహత్యకు కారణాలు బయటకు రాలేదు. ఆమె రాసిందని చెబుతున్న సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కేసునునమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

అయితే.. ఈ విద్యార్థిని ఎందుకు సూసైడ్ చేసుకుంది? కుటుంబ సమస్యలా? లేక.. మరేదైనా కారణమా? అన్న కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు తరచూ ఆత్మహత్యలు చేసుకోవటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.