Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ సొంత నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల రాజీనామా!

By:  Tupaki Desk   |   30 Sep 2016 5:47 AM GMT
కేటీఆర్‌ సొంత నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల రాజీనామా!
X
కరీంనగర్ జిల్లా సిరిసిల్లా జిల్లా ఏర్పాటు టీఆర్ ఎస్‌ లో కుంప‌ట్ల‌కు కార‌ణం అవుతోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఈ నియోజ‌క‌వ‌ర్గం కొత్త‌ జిల్లాగా మార‌డం లేద‌ని అసంతృప్తులు పెల్లుబికుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా అధికార టీఆర్‌ ఎస్ పార్టీ సభ్యత్వానికి సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ బూట్ల రుక్కుంబాయి - ఆమె భర్త పద్మశాలి - వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బూట్ల సుదర్శన్ రాజీనామా సమర్పించారు.

సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమంలో పాల్గొంటున్నారనే కారణంతో సుదర్శన్ - రుక్కుంబాయి దంపతులపై ఇదే పార్టీకి చెందిన టీఆర్‌ ఎస్ యూత్ విభాగం నాయకులు దాడి జరిపి ఇంటిలో సామగ్రిని ధ్వంసం చేశారు. దీనిపై పద్మశాలీలు అత్యధికంగా ఉన్న సిరిసిల్లలో ఈ దాడి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, పార్టీలో ఉంటూ జిల్లా ఉద్యమంలో పాల్గొనేవారు రాజీనామాలు చేసి పాల్గొనాలని పట్టణ తెరాస అధ్యక్షులు ప్రకటించారు. అయితే తమ కుటుంబంపై స్వంత పార్టీ శ్రేణులే దాడికి పూనుకోవడం, దీనిపై పార్టీ శ్రేణులు వారిపై ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్‌ ఎస్ పార్టీకి మున్సిపల్ కౌన్సిలర్ రుక్కుంబాయి - సుదర్శన్ దంపతులు రాజీనామా చేశారు. వీరితో పాటు 27వ వార్డు టీఆర్‌ ఎస్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చింతకింది మల్లికార్జున్ - శివరాత్రి నటరాజ్‌ తో పాటు వార్డు కమిటీ సభ్యులందరూ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే మరో 500 మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేయనున్నట్టు సుదర్శన్ తెలిపారు. అలాగే త్వరలో కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయనున్నట్టు - ఇందుకోసం సమావేశం నిర్వహించి వేదికపై రాజీనామా చేస్తామని సుదర్శన్ వెల్లడించారు. ఇదిలా ఉండగా జిల్లా సాధన కోసం ఉద్యమిస్తున్న సుదర్శన్ - రుక్కుంబాయి దంపతులు రాజీనామా ప్రకటన పట్ల ఉద్యమకారుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.