Begin typing your search above and press return to search.

మోదీ కామెంట్‌ కు థ‌రూర్ కౌంట‌ర్‌

By:  Tupaki Desk   |   17 Oct 2017 10:22 AM GMT
మోదీ కామెంట్‌ కు థ‌రూర్ కౌంట‌ర్‌
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి శ‌శిథ‌రూర్‌.. షాకింగ్ కామెంట్లు కుమ్మ‌రించారు. మోదీకి ఒక్క గుజ‌రాతీ ప్ర‌జ‌లన్నా.. ఆ రాష్ట్ర‌మ‌న్నా మాత్ర‌మే ప్రేమ ఉంద‌ని కానీ, కాంగ్రెస్‌ కు - కాంగ్రెస్ నేత‌గా త‌న‌కు వ్య‌క్తుల మ‌ధ్య ప్రాంతీయ భేష‌జాలు లేవ‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. థ‌రూర్ వ్యాఖ్య‌లు మోదీని టార్గెట్ చేసినా.. పొలిటిక‌ల్‌గా బీజేపీ నేత‌ల‌ను తీవ్ర‌స్థాయిలో కుదిపేశాయ‌ని తెలుస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్ అధినేత‌లు.. గాంధీలకు గుజరాతీలంటే అస్సలు నచ్చదంటూ ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. ప్ర‌సంగించిన మోదీ.. సోనియా - రాహుల్‌ - ఇందిర‌ - రాజీవ్‌ గాంధీల ప్ర‌స్తావ‌న తీసుకురాకుండా.. విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎప్పుడూ మోరార్జీ దేశాయ్‌ పనిని - మహాత్మాగాంధీ అంకితభావాన్ని - ఆదర్శభావాలను గురించి ప్రస్తావించారని, ఎప్పుడూ వారేం తాగారు వారేం తిన్నారు అనే విషయాలనే చెబుతుంటారని మోదీ విమర్శించారు. దీంతో గుజ‌రాత్ వాసులు.. కాంగ్రెస్‌ కు దూర‌మ‌వుతార‌ని మోదీ ప్లాన్ చేశారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ నేత శశిథరూర్‌ ట్విట్టర్‌ ద్వారా కౌంటర్‌ ఇచ్చారు. మోదీకి ఒక్క గుజరాత్‌ అంటేనే ప్రేమ ఉందని విమర్శించారు. మోదీ చెప్పినట్లుగా తమకు గుజరాతీలంటే ఏహ్య భావం అస్సలు లేదని చెప్పారు. `నా కుమారుడు కూడా గుజరాతీ అమ్మాయినే చేసుకున్నాడు`` అని థ‌రూర్ పేర్కొన్నారు

``మోదీజీ.. మాకు ఎలాంటి భేషజాలు లేవు.. మీకు మాత్రం ఒక్క గుజరాత్‌ అంటేనే ప్రేమ ఉన్నట్లుంది' అంటూ ఆయన చుర‌క‌లంటించారు. వాషింగ్టన్‌ పోస్ట్‌ లో జర్నలిస్టుగా పనిచేస్తున్న శశిథరూర్‌ కుమారుడు ఇషాన్‌ థరూర్‌ భూమిక అనే గుజరాతీ అమ్మాయిని గత ఆదివారమే వివాహం చేసుకున్నారు. దీంతో త‌మ‌కు - గుజ‌రాత్‌ కు మ‌ధ్య బంధుత్వం కూడా ఏర్ప‌డింద‌న్న కోణంలో థ‌రూర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా మోదీని ఏకేశార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఈ కామెంట్ల‌కు బీజేపీ నేత‌ల రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.