Begin typing your search above and press return to search.

నాలుగో మోడీ కూడా ఇలాగే జంప్ అవుతాడు

By:  Tupaki Desk   |   23 Feb 2018 6:30 AM GMT
నాలుగో మోడీ కూడా ఇలాగే జంప్ అవుతాడు
X
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కు భారీ స్థాయిలో టోక‌రాపెట్టిన వ‌జ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ ఉదంతంపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున వ్యంగ్య వ్యాఖ్యలు - విమర్శలు - నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేయ‌డంలో ముందుండే బీజేపీకి చెందిన పాట్నా ఎంపీ శత్రుఘ్న సిన్హా తాజాగా ట్విట్టర్‌ లో మ‌రో సంచ‌ల‌న సెటైర్‌ వేశారు. లలిత్‌ మోడీ - జతిన్‌ మోడీ - నిరవ్‌ మోడీ...దేశాన్ని ముంచి విదేశాలకు పారిపోయారు, నాలుగో మోడీ (ప్రధాని మోడీ) కూడా ఇలాగే దేశ ప్రజల్ని మోసం చేస్తాడని...అర్థం వచ్చేట్టు ట్విట్టర్‌ లో సిన్హా చేసిన రాజకీయ వాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షించింది.

ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వ్యంగ్యధోరణి సందేశాలతో తమ నిరసన వ్యక్తం చేయడం ట్రెండ్‌ గా మారిపోయింది. ప్రత్యేకమైన విషయాన్ని గానీ - వ్యక్తి మాటల్ని గానీ ఉటంకిస్తూ సెటైర్లు వేయడం నెటిజన్లు బాగా వంటబట్టించుకున్నారు. తమకు నచ్చని విషయాన్నైనా, వ్యక్తినైనా ఈ తరహాలో విమర్శిస్తుంటారు. దేశంలో సంచలనం సృష్టిస్తోన్న కుంభకోణాలపై సామాజిక మాధ్యమంలో వ్యంగ్యధోరణిలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మోడీ సర్కార్‌ కు ఎక్కడ తగలాలో...అక్కడ తగిలేట్టు బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా ట్వీట్ వ‌దిలార‌ని అంటున్నారు.

శత్రుఘ్న చేసిన ట్వీట్ ఇది

మిత్రులారా ముగ్గురు మోడీలు వెళ్లారు...

లలిత్‌ మోడీ

జతిన్‌ మోడీ

నీరవ్‌ మోడీ

నాలుగో జోలె దాచి ఉంచండి. ఆయన చాలా సెంటిమెంటల్‌ మనిషి'' అని ఆ ట్వీట్‌ సారాంశం.