Begin typing your search above and press return to search.

‘సుల్తాన్’ను నిర్దోషి అన్న రాజస్థాన్ హైకోర్టు

By:  Tupaki Desk   |   25 July 2016 7:27 AM GMT
‘సుల్తాన్’ను నిర్దోషి అన్న రాజస్థాన్ హైకోర్టు
X
తన తాజా చిత్రం ‘సుల్తాన్’ సూపర్ హిట్ తో హ్యాపీగా ఉన్న సల్మాన్ ఖాన్ కు మరో భారీ ఊరట లభించింది. ఆయన మీదున్న కృష్ణ జింకల వేటాడిన కేసుకు సంబంధించి రాజస్థాన్ హైకోర్టుకీలక తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు ఆయన్ను మరింత రిలాక్స్ చేస్తుందనటంలో సందేహం లేదు.

1998లో జోథ్ పూర్ లోని రెండు వేర్వేరు ఘటనల్లో ఒక కృష్ణ జింకను.. ఒక మామూలు జింకను వేటాడినట్లుగా బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ తో సహా మరో ఏడుగురిపైన కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు జోథ్ పూర్ కోర్టు ఐదేళ్లు జైలుశిక్ష విధిస్తూ గతంలో తీర్పు ఇచ్చారు. అయితే.. ఈ తీర్పును సవాలు చేస్తూ సల్మాన్ రాజస్థాన్ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. ఈ వాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా తన తీర్పును వెల్లడించింది.

కృష్ణ జింకల కేసులో జోథ్ పూర్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన రాజస్థాన్ హైకోర్టు.. సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించింది. తాజాగా వెలువడిన తీర్పుతో కృష్ణ జింకల కేసు నుంచి సల్మాన్ విముక్తి అయినట్లేనని చెప్పాలి.