Begin typing your search above and press return to search.

అణుయుద్ధం చేస్తే..పీఓకే మ‌న‌దే

By:  Tupaki Desk   |   24 Jun 2018 11:04 AM GMT
అణుయుద్ధం చేస్తే..పీఓకే మ‌న‌దే
X
కాంగ్రెస్ సీనియర్ సైఫుద్దీన్ సోజ్ మ‌రోమారు పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలు తమ స్వాతంత్య్రానికే తొలి ప్రాధాన్యతనిస్తారంటూ పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు ముషారఫ్ గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ రెండ్రోజుల క్రితం వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ``కశ్మీరీలకు తమ అభిప్రాయాల్ని వెల్లడించే స్వేచ్ఛను కల్పిస్తే స్వాతంత్య్రానికే వారు తొలి ప్రాధాన్యతనిస్తారని గతంలో ముషారఫ్ చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. కశ్మీరీల తొలి ప్రాధాన్యం స్వాతంత్య్రమే. ఇది వాస్తవం.`` అని సైఫుద్దీన్ సోజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అయిన‌ప్ప‌టికీ ఈ కాంగ్రెస్ సీనియర్ నేత త‌న దూకుడు ఏ మాత్రం త‌గ్గించుకోకుండా మ‌రో సంచ‌ల‌న కామెం చేశారు.

తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ భారత్-పాక్ ల మధ్య న్యూక్లియర్ వార్ జరిగితే తప్ప పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ భారత్‌లో భాగమవదన్నారు. భారత్ కాశ్మీర్ వ్యాలీని పాలిస్తున్నట్లుగానే పాకిస్ధాన్ కూడా పీఓకేనిని పరిపాలిస్తుందన్నారు. కశ్మీర్ ప్రజలు పాకిస్ధాన్‌ లో కలవాలనుకోవ‌డంలేదని - మొదట తమకు స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారని పాకిస్ధాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యలు స‌మ‌స్య‌కు ప‌రిష్కార‌మ‌ని సైఫుద్దీన్ అన్నారు.పీవోకే భారత్ సొంతమవ్వాలంటే రెండుదేశాల మధ్య అణుయుద్దం తప్పనిసరి అని ఆయన తెలిపారు. అప్పుడే ఈ వివాదానికి ప‌రిష్కారం దొరుకుతుంద‌న్నారు.

ఇదిలాఉండ‌గా...రాష్ట్రంలో విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలు తీసుకోవాలని, అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రాకు ఎన్‌సీ సహా పలు పార్టీలు విజ్ఞప్తిచేశాయి. మెరుగైన పరిపాలన కోసం సలహాలు - సూచనలు అందించేందుకు శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని గవర్నర్ నిర్వహించారు.